కంటతడి పెట్టిస్తున్న ‘కరోనా’ చిత్రం!
కంటికి కనిపించని శత్రువుతో బయటికి కనిపించని యుద్ధం చేస్తోంది చైనా. కరోనా వైరస్ ప్రభావంతో ఆ దేశంలో ఇప్పటికే విషాద చాయాలు అలుముకున్నాయి. రోజురోజుకూ విస్తరిస్తున్న వైరస్ను అడ్డుకునే మార్గం దొరక్క వైద్యులు, శాస్త్రవేత్తలు తలలుపట్టుకుంటున్నారు.
ఇంటర్నెట్డెస్క్: కంటికి కనిపించని శత్రువుతో బయటికి కనిపించని యుద్ధం చేస్తోంది చైనా. కరోనా వైరస్ ప్రభావంతో ఆ దేశంలో ఇప్పటికే విషాద ఛాయలు అలముకున్నాయి. రోజురోజుకూ విస్తరిస్తున్న వైరస్ను అడ్డుకునే మార్గం దొరక్క వైద్యులు, శాస్త్రవేత్తలు తలలుపట్టుకుంటున్నారు. మరోవైపు ప్రభుత్వం కూడా ఆర్థికంగానూ దెబ్బతింటోంది. ఇప్పటికే దాదాపు 3,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 80వేలకు పైగా వైరస్ సోకి మంచంపట్టారు. ఆసుపత్రిలో చేరిన కరోనా బాధితులు తిరిగి వస్తారో రారో తెలియక చైనీయుల గుండెలు బరువెక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో వైరల్గా మారిన ఒక కరోనా బాధితుడి చిత్రం అందర్నీ కంటతడి పెట్టిస్తోంది.
ఆసుపత్రిలో కరోనా బాధితుల పరిస్థితి ఎలా ఉంటుందో మనకు తెలిసిందే. కనీసం జెల్లో ఖైదీలకైనా అప్పుడప్పుడు బయటి ప్రపంచాన్ని చూపిస్తారు. తనవాళ్లతో మాట్లాడుకునే అవకాశం కల్పిస్తారు. కానీ, కరోనా బాధితుల పరిస్థితి మాత్రం దయనీయం. ఎవర్నీ చూడనివ్వరు. ఎవరితో మాట్లాడనివ్వరు. వాళ్లు ఆసుపత్రి నుంచి బయటికి రావాలంటే రెండే మార్గాలు. ఒకటి వైరస్ నుంచి కోలుకోవాలి. లేదంటే ప్రాణాలైనా విడిచిపెట్టాలి.
కరోనా ప్రభావం ఎక్కువగా వుహాన్లో 87 ఏళ్ల ఓ వ్యక్తి కరోనా లక్షణాలతో ఆసుపత్రిలో చేరాడు. అతడికి కరోనా ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీంతో నెల రోజుల పాటు ఆసుపత్రిలోనే ఉండాలని వైద్యులు సూచించారు. దీంతో ఇక బయటికి వెళతానన్న నమ్మకం కోల్పోయిన ఆ వృద్ధుడు తన పర్యవేక్షణ చూసుకునే వైద్యుడిని ఒక కోరిక కోరాడు. ఒక్కసారి సూర్యాస్తమయాన్ని చూడాలని ఉందని, ఎలాగైనా తనకు చూపించాలని వేడుకున్నాడు. వృద్ధుడి కోరిక కాదనలేకపోయిన ఆ వైద్యుడు మంచంతో సహా వృద్ధుడిని బయటికి తీసుకెళ్లాడు. భవనాల మధ్యలో నుంచి అస్తమిస్తున్న సూర్యుడిని ఆ వృద్ధుడికి చూపించాడు. సూర్యాస్తమయాన్ని చూసిన ఆ వృద్ధుడు మురిసిపోయాడు. దీనికి సంబంధించిన చిత్రం ఓ వ్యక్తి ట్విటర్లో పోస్టు చేశాడు. ఈ దృశ్యాన్ని చూసి చాలా మంది నెటిజన్లు.. ‘ఇది గుండెలు పిండేస్తున్న దృశ్యం. వైద్యులు నిజంగా మన హీరోలు’ అని పేర్కొంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా ప్రచార రథం ఢీకొని బాలుడి మృతి విషాదకరం: చంద్రబాబు
వైకాపా ప్రచారరథం ఢీకొని బాలుడు మృతి చెందిన ఘటన అత్యంత విషాదకరమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
దిల్లీ మద్యం స్కామ్.. సీబీఐ కేసులోనూ అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి
దిల్లీ మద్యం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. గతంలో ఈడీ కేసులో అప్రూవర్గా మారిన నిందితుడు శరత్ చంద్రారెడ్డి, సీబీఐ నమోదు చేసిన కేసులోనూ అప్రూవర్గా మారారు. -
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. భారాస ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి సమావేశంలో పాల్గొన్నారని ఆరోపిస్తూ ఇటీవల వారిపై సస్పెన్షన్ వేటు వేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
చిలుకూరు మార్గంలో భారీగా ట్రాఫిక్జామ్: వాహనాలు నిలిపి.. కి.మీ మేర నడిచి..
చిలుకూరు బాలాజీ ఆలయం వైపు వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. 10 కి.మీ పైగా వాహనాలు నిలిచిపోయాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వి‘నాసి’కారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
బెంగాల్లో సీపీఐ(ఎం), కాంగ్రెస్ భాజపా కోసం పని చేస్తున్నాయి: మమతా బెనర్జీ
-
వైకాపా ప్రచార రథం ఢీకొని బాలుడి మృతి విషాదకరం: చంద్రబాబు
-
ఘోరం: పెదవులను అతికించి.. నెల రోజులు లైంగికంగా హింసించి..!
-
రష్యన్ బాంబర్ కూల్చివేత.. యుద్ధంలో ఇదే తొలిసారి..: ఉక్రెయిన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
నెల్లూరులో తెదేపాలో చేరిన 100 మంది వాలంటీర్లు