ఏపీలో మున్సిపల్‌ వార్డుల రిజర్వేషన్లు ఖరారు

ఏపీలో మున్సిపల్‌ కార్పొరేషన్ల మేయర్ల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. మేయర్ల రిజర్వేషన్ల వివరాలను పరిశీలిస్తే.. అనంతపురం - జనరల్‌, చిత్తూరు - ఎస్సీ జనరల్‌, ఏలూరు - జనరల్‌ మహిళ, గుంటూరు - జనరల్‌, కడప -బీసీ జనరల్‌...

Published : 08 Mar 2020 01:10 IST


అమరావతి: ఏపీలో మున్సిపల్‌ కార్పొరేషన్ల వార్డులకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. రాష్ట్రంలో మొత్తం 12 కార్పొరేషన్లలోని 671 వార్డులకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. వార్డుల వారీగా రిజర్వేషన్లను ఖరారు చేస్తూ అధికారిక ఉత్తర్వులు విడుదలయ్యాయి. వీటికి సంబంధించిన గెజిట్‌ నోటిఫికేషన్‌ను పురపాలక కమిషనర్‌ విజయ్‌కుమార్‌ విడుదల చేశారు. అనంతపురం - 50, చిత్తూరు 50, ఏలూరు 50 వార్డులకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. వీటితో పాటు గుంటూరు 57, కడప 50, కర్నూలు 52, మచిలీపట్నం 50, ఒంగోలు 50, తిరుపతి 50, విజయవాడ 64, విశాఖ 98, విజయనగరం 50 వార్డులకు రిజర్వేషన్లను ఖరారు చేశారు. ఈ నెల 9న పురపాలక ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల కానుంది.

గెజిట్‌ నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని