ఆకలిలేని సమాజం కోసం...
వివిధ రంగాల్లో ప్రతిభ చాటుతున్న మహిళలు సామాజిక సేవలోనూ దూసుకెళ్తున్నారు. సమాజం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పరిష్కారం చూపేందుకు కృషి చేస్తున్నారు......
మోదీ మెచ్చిన మహిళల్లో ఒకరీమె..
చెన్నై: వివిధ రంగాల్లో ప్రతిభ చాటుతున్న మహిళలు సామాజిక సేవలోనూ దూసుకెళ్తున్నారు. సమాజం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పరిష్కారం చూపేందుకు కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో ఎన్జీఓలు స్థాపించి ప్రజలకు చేరువవుతున్నారు. అలా పుట్టిందే ‘ఫుడ్బ్యాంక్-ఇండియా’. 130 కోట్ల మంది జనాభా ఉన్న భారత్లో నేటికీ లక్షలాది మంది ఆకలితో అలమటిస్తున్నారు. అలాంటి వారి దీనస్థితికి చలించిన స్నేహా మోహన్దాస్ ఈ ఎన్జీఓను స్థాపించారు. ఆకలిలేని సమాజ సృష్టి కోసం ముందుకు సాగుతున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా మోదీ ఖాతాను నిర్వహించే అవకాశం దక్కించుకున్నారు.
మన ఇంట్లో వండిందే...
కొంతమంది వలంటీర్లతో కలిసి స్నేహా మోహన్దాస్ చెన్నైలోని వీధుల్లో తిరుగుతారు. ఆశ్రయం లేక అనాథలైన ఎంతో మందిని పలకరిస్తారు. వారితో కాసేపు మాట్లాడి వారి బాగోగులు తెలుసుకుంటారు. అనంతరం భోజన ప్యాకెట్లను వారికి అందజేస్తున్నారు. ఈ ఆహారాన్ని వారు ఎక్కడి నుంచి సేకరిస్తారో తెలుసా? మనం ఇంట్లో వండుకునేటప్పుడు స్తోమతకు తగ్గట్లు ఎంతమందికి వీలైతే అంతమందికి ఎక్కువ వండితే చాలు. ఈ విషయాన్ని ఫుడ్బ్యాంక్-ఇండియాకు సమాచారమివ్వాలి. దగ్గర్లో ఉండే వలంటీర్లు వచ్చి ఆహారాన్ని సేకరిస్తారు. దాన్ని ప్యాక్ చేసి అభాగ్యులకు అందజేస్తారు. దీనికోసం వారు సోషల్ మీడియాని సమర్థంగా వినియోగించుకుంటున్నారు. చెన్నై, బెంగళూరు, కోల్కతా, హైదరాబాద్ సహా మరికొన్ని ప్రముఖ నగరాల్లో ‘ఫుడ్బ్యాంక్-ఇండియా’ పనిచేస్తోంది.
అమ్మ నుంచే స్ఫూర్తి...
చెన్నైలో జన్మించిన స్నేహా మోహన్దాస్ అక్కడే విద్యాభ్యాసం పూర్తిచేశారు. అన్నమలై విశ్వవిద్యాలయం నుంచి సామాజిక శాస్త్రంలో పట్టా పుచ్చుకున్నారు. డబ్బింగ్ ఆర్టిస్ట్గా పనిచేసిన అనుభవమూ ఉంది. తన తల్లి నుంచే స్నేహ స్ఫూర్తి పొందారు. ఎంతోమంది నిరాశ్రయులకు ఆమె ఇంటికి పిలిచి భోజనం పెట్టేవారు. ఇలాంటి వారు ఎంతో మంది ఉంటారని గుర్తించిన స్నేహ వారి కోసం ఏదో చేయాలని సంకల్పించారు. ఆ ఆశయం నుంచి పుట్టిందే ఫుడ్బ్యాంక్-ఇండియా.
నాకు నచ్చింది చేయడంలోనే నేను స్ఫూర్తి పొందుతాను. మోదీ ఖాతా ద్వారా నేను ఈరోజు అందరిలో స్ఫూర్తి నింపాలనుకుంటున్నాను. మాస్ కుకింగ్, కుకింగ్ మారథాన్స్, బ్రెస్ట్ ఫీడింగ్ అవేర్నెస్ కార్యక్రమాల్ని చేపడుతున్నాం. మాతో అందరూ చేతులు కలపాలని కోరుతున్నాం. ప్రతిఒక్కరు కనీసం ఒక్కరికైనా సాయం చేయండి. ఆకలి లేని సమాజ నిర్మాణంలో భాగంకండి. -స్నేహా మోహన్దాస్, నరేంద్ర మోదీ ట్విటర్ ఖాతాలో
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
శిరోముండనం కేసు.. హైకోర్టులో విచారణ వాయిదా
శిరోముండనం కేసులో విశాఖపట్నం కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. -
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీ పిటిషన్పై తీర్పు వాయిదా
సీఎం జగన్పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ కస్టడీ పిటిషన్పై తీర్పును విజయవాడ కోర్టు వాయిదా వేసింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి
ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయంలో చిన్న హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
పాటలతో రీల్స్.. మాటలతో మీమ్స్
లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే నామపత్రాల ప్రక్రియ జోరందుకొంది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు క్షేత్రస్థాయిలో తిరుగుతూ ప్రచారం చేస్తూనే సామాజిక మాధ్యమాల్లోనూ చురుగ్గా ఉంటున్నారు. -
భగభగ మండే
విపరీతమైన ఎండలకు మిర్యాలగూడ ప్రాంతం మాడిపోతోంది. సోమవారం మండల పరిధిలోని టీక్యాతండాలో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రత 45 డిగ్రీలు నమోదైంది. -
పట్టాలెక్కని ప్రతిపాదనలు
ఉమ్మడి జిల్లాలో రైల్వే శాఖాపరంగా అభివృద్ధికి అడుగులు పడాలని ప్రయాణికులు ఆశిస్తున్నారు. -
ప్రతి ఓటును ఒడిసిపట్టేలా..
సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని భారాస.. పాతికేళ్ల తర్వాత అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని కాంగ్రెస్... ఈసారి సత్తా చాటాలని భాజపా.. పక్కా వ్యూహంతో ముందుకు కదులుతున్నాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (23/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ఓటీపీ రూటు మారితే అలర్ట్.. సైబర్ మోసాలకు చెక్ పెట్టేందుకు కొత్త అస్త్రం!
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
-
నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్
-
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!