రైలు-ప్లాట్‌ఫాం మధ్య ఇరుక్కున్న ప్రయాణికుడు

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో ఓ వ్యక్తికి త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. విజయవాడకు చెందిన ఎలమందరావు సికింద్రాబాద్‌ స్టేషన్‌లో నరసాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ ఎక్కే క్రమంలో జారి పడి ఫ్లాట్‌ఫాం, రైలు మధ్యలో....

Published : 09 Mar 2020 01:29 IST

సికింద్రాబాద్‌: సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో ఓ వ్యక్తికి త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. విజయవాడకు చెందిన ఎలమందరావు సికింద్రాబాద్‌ స్టేషన్‌లో నరసాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ ఎక్కే క్రమంలో జారి పడి ఫ్లాట్‌ఫాం, రైలు మధ్యలో చిక్కుకున్నాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న సీజీపీ కానిస్టేబుల్‌ డేవిడ్‌ రాజు ఇతర ప్రయాణికుల సాయంతో అతడిని పైకి లాగారు. ఘటనలో స్వల్ప గాయాలతో బాధితుడు బయటపడ్డాడు. చాకచక్యంగా స్పందించి వ్యక్తి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్‌ను అధికారులు అభినందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని