మా అమ్మకూ ప్రాణ హాని: అమృత

మారుతీరావు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని ఆయన కుమార్తె అమృత అన్నారు. అయితే ఆయన ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని వ్యాఖ్యానించారు. మిర్యాలగూడలో అమృత మీడియాతో మాట్లాడారు. తన భర్త ప్రణయ్‌ హత్య కేసులో శిక్ష

Updated : 09 Mar 2020 18:55 IST

మిర్యాలగూడ: మారుతీరావు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని ఆయన కుమార్తె అమృత అన్నారు. అయితే ఆయన ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని వ్యాఖ్యానించారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో అమృత మీడియాతో మాట్లాడారు. తన భర్త ప్రణయ్‌ హత్య కేసులో శిక్ష భయంతోనే మారుతీరావు ఆత్మహత్యకు పాల్పడ్డారనేది కరెక్ట్‌ కాకపోవచ్చని ఆమె అభిప్రాయపడ్డారు.

మా అమ్మకూ ప్రాణ హాని
‘‘మారుతీరావుకు బినామీ పేర్లతో చాలా ఆస్తులు ఉన్నాయి. ఆస్తుల విషయంలో బాబాయ్‌ శ్రవణ్‌కు ఆయనకు మధ్య గొడవలు ఉన్నాయి. మారుతీరావును శ్రవణ్‌ కొన్నిసార్లు కొట్టినట్లు నాకు తెలిసింది. డబ్బుల విషయంలో సుపారీ గ్యాంగ్ బెదిరింపులు కూడా ఆత్మహత్యకు ఒక కారణం కావొచ్చు. బాబు పుట్టాక అమ్మ నాతో మాట్లాడింది. బాబును చూపించాలని కోరితే నేను నిరాకరించా. నాన్నకు కోర్టు పరంగా శిక్ష పడాలని కోరుకున్నా. ఆత్మహత్య చేసుకోవడం తప్పే. మారుతీరావు ఆత్మహత్య చేసుకోవడం కూతురిగా బాధ పడుతున్నా. శ్రవణ్ నుంచి అమ్మకు ప్రాణ హాని ఉంది. శ్రవణ్‌ రెచ్చగొట్టడం వల్లే ప్రణయ్‌ను మారుతీరావు హత్య చేయించారు. మారుతీరావు ఆస్తులపై నాకు ఆసక్తి లేదు’’ అని అమృత అన్నారు. తల్లి దగ్గరకు వెళ్లేది లేదని తెగేసి చెప్పిన అమృత.. ఆమె తన దగ్గరకు వస్తే బాగోగులు చూసుకుంటానని చెప్పింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని