ఎన్జీటీలో బయోమెట్రిక్ తాత్కాలిక రద్దు
కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న క్రమంలో ఎన్జీటీ(నేషనల్ గ్రీన్ ట్రైబ్యూనల్) ముందస్తు చర్యలు చేపట్టింది. దిల్లీలోని ఎన్జీటీ ప్రధాన కార్యాలయంలో ఉద్యోగులు హాజరును బయోమెట్రిక్ యంత్రంలో వేయాల్సిన అవసరం లేదని ప్రకటించింది.
దిల్లీ: కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న క్రమంలో ఎన్జీటీ(నేషనల్ గ్రీన్ ట్రైబ్యూనల్) ముందస్తు చర్యలు చేపట్టింది. దిల్లీలోని ఎన్జీటీ ప్రధాన కార్యాలయంలో ఉద్యోగులు హాజరును బయోమెట్రిక్ యంత్రంలో వేయాల్సిన అవసరం లేదని ప్రకటించింది. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. బయోమెట్రిక్ వ్యవస్థను తాత్కాలికంగా నిలిపివేయాలంటూ దిల్లీ ప్రభుత్వం అన్ని ప్రభుత్వ విభాగాలతో పాటు కార్యాలయాలకు గతంలోనే ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఇక నుంచి ఉద్యోగులకు కార్యాలయానికి వచ్చిన సమయంతో పాటు వెళ్లిన సమయాన్ని మాన్యువల్(చేతి పుస్తకంలో రాయడం) ద్వారా నమోదు చేయాలని ఎన్జీటీ సూచించింది. మార్చి 31 వరకూ ఈ విధానం అమలులో ఉంటుందని తెలిపింది.
బయోమెట్రిక్ వ్యవస్థను నిలిపివేయాలంటూ కేంద్రప్రభుత్వం మార్చి 6నే అన్ని ప్రభుత్వ కార్యాలయాలను కోరింది. కర్ణాటకలో ఇప్పటికే బయోమెట్రిక్ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఆ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. ఇదిలా ఉండగా.. భారత్లో కరోనా బాధితుల సంఖ్య 41కు చేరింది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే 3,300 మందికిపైగా ప్రాణాలు విడిచారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
విశాఖ ఉక్కు కర్మాగారానికి చెందిన భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఏపీ హైకోర్టు ఆదేశించింది. -
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై ప్రజల నుంచి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఫిర్యాదులు, నివేదనలు కోరింది. -
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
సీఎం జగన్కు బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుందని వైఎస్ సునీత అన్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్ - బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా గురువారం రాత్రి 7.30 గంటలకు సన్రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. -
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
సీఎం జగన్ (YS Jagan)కు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్య (Viveka Murder Case)కు కారకులైన వారికి మళ్లీ ఎంపీగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారంటూ ఆమె నిలదీశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM