
స్థానిక ఎన్నికల వ్యయ పరిశీలకులు వీళ్లే
అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు, రాజకీయ పార్టీల వ్యయంపై నిఘా పెట్టేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం వ్యయ పరిశీలకులను నియమించింది. అటవీశాఖ ఉన్నతాధికారులను 13 జిల్లాలకు ఎన్నికల వ్యయ పరిశీలకులుగా నియమిస్తూ ఎస్ఈసీ రమేశ్కుమార్ ఆదేశాల జారీ చేశారు. వీరంతా స్థానిక ఎన్నికల ఖర్చుపై ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుని తనిఖీ చేయాలని ఆదేశించారు.
వ్యయపరిశీలకులు వీళ్లే
పి.రామకృష్ణ- కృష్ణా
బీఎన్ఎన్ మూర్తి- గుంటూరు
ఎం.శివప్రసాద్- కర్నూలు
ఆర్.యశోదాబాయి-శ్రీకాకుళం
అలాన్ చోంగ్ టెరోన్- కడప
సి.సెల్వం-తూర్పుగోదావరి
నందిని సలేరియా- విశాఖపట్నం
జగన్నాథ్సింగ్-చిత్తూరు
అనంత్శంకర్- పశ్చిమగోదావరి
జీజీ నరేంద్రన్- అనంతపురం
జి. సందీప్ కృపాకర్ - విజయనగరం
సునీల్కుమార్- నెల్లూరు
జి.శేఖర్బాబు-ప్రకాశం
వీరితో పాటు ఈసీ మరో నలుగురిని నియమించి వారిని రిజర్వులో ఉంచింది.