నిత్యానంద కేసు: పోలీసులపై ఎఫ్ఐఆర్ నమోదు
వివాదాస్పద మతగురువు నిత్యానందపై నమోదైన అక్రమ నిర్బంధం కేసు మరో మలుపు తిరిగింది. కోర్టు ఆదేశాల మేరకు 14 మందిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. అందులో దర్యాప్తు చేసిన పోలీసు అధికారులతో పాటు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు కూడా ఉండటం గమనార్హం.
అహ్మదాబాద్ (గుజరాత్): వివాదాస్పద మతగురువు నిత్యానందపై నమోదైన అక్రమ నిర్బంధం కేసు మరో మలుపు తిరిగింది. కోర్టు ఆదేశాల మేరకు 14 మందిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. అందులో దర్యాప్తు చేసిన పోలీసు అధికారులతో పాటు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు కూడా ఉండటం గమనార్హం. అహ్మదాబాద్లోని తన ఆశ్రమంలో ఇద్దరు అమ్మాయిలతో పాటు ఓ బాలుడిని అక్రమంగా నిర్బంధించి శారీరకంగా వేధించారని నిత్యానందపై ఆరోపణలు వచ్చాయి. దీంతో నిత్యానందతో పాటు శిష్యురాళ్లుగా ఉన్న ఇద్దరు మహిళలపై గతంలోనే పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఆశ్రమంలోని పిల్లల విషయంలో అసభ్యంగా ప్రవర్తించారని నిత్యానంద అనుచరుడు గిరీశ్ కోర్టును ఆశ్రయించారు. చిన్నారులకు అధికారులు అసభ్యకరమైన వీడియోలు చూపిస్తూ వారిపై భౌతికంగా దాడి చేశారన్నారు. వారిని అడగకూడని ప్రశ్నలు అడుగుతున్నారని తన పిటిషన్లో పేర్కొన్నారు.
పిటిషన్ను పరిశీలించిన పోక్సో న్యాయస్థానం దర్యాప్తులో పాల్గొన్న పోలీసులతో పాటు బాలల సంక్షేమ సంఘం అధికారులపైనా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు 14 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు అహ్మదాబాద్లోని వివేకానందనగర్ పోలీసులు తెలిపారు. దర్యాప్తులో పాల్గొన్న అధికారుల స్టేట్మెంట్లు తీసుకున్నామని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. తనపై కేసు నమోదైన వెంటనే నిత్యానంద అజ్ఞాతంలోకి వెళ్లారు. తాను సొంతంగా ‘కైలాస’ అనే దేశాన్ని సృష్టించినట్లు, దాన్ని ఒక దేశంగా గుర్తించాలని ఐక్యరాజ్య సమితికి కూడా విజ్ఞప్తి చేయనున్నట్లు అప్పట్లో వార్తలు వినిపించిన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
అప్పుడు ధోనీ నన్ను ఎత్తుకోవడం ఎంతో ఆనందంగా ఉంది: రవీంద్ర జడేజా
-
కేసీఆర్ చేసిన మొదటి తప్పు అదే: మంత్రి కోమటిరెడ్డి
-
దెబ్బతీయాలనుకునేవారికి ప్రజలే జవాబు చెప్తారు: కేటీఆర్
-
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
-
కేజ్రీవాల్ ఫోన్లోని ఎన్నికల వ్యూహాల కోసం.. ఈడీ ప్రయత్నాలు: ఆతిశీ