ఆవిడ.. వృద్ధాప్యాన్ని జయించింది
‘రేయ్ మామా అర్జెంటుగా బాడీ పెంచాల్రా.. రేపు ఉదయం 6గంటలకు అలారం పెట్టుకో.. ఇద్దరం కలిసి జిమ్కు పోదాం.. మిస్ చేయొద్దు’.. ఇద్దరు స్నేహితుల మధ్య తరచూ చోటుచేసుకునే సంభాషణ ఇది. అయితే, ఆ ఇద్దరిలో ఎవరికీ ఈ మాటలు తర్వాతి రోజు గుర్తుండవు..
అట్టావా(కెనడా): ‘రేయ్ మామా అర్జెంటుగా బాడీ పెంచాల్రా.. రేపు ఉదయం 6గంటలకు అలారం పెట్టుకో.. ఇద్దరం కలిసి జిమ్కు పోదాం.. మిస్ చేయొద్దు’.. ఇద్దరు స్నేహితుల మధ్య తరచూ చోటుచేసుకునే సంభాషణ ఇది. అయితే, ఆ ఇద్దరిలో ఎవరికీ ఈ మాటలు తర్వాతి రోజు గుర్తుండవు.. ఒకవేళ గుర్తంచుకొని జిమ్లో చేరినా వారం రోజుల్లోపే జిమ్కు టాటా చెప్పేవారే ఎక్కువ. కొంతమంది మాత్రం క్రమం తప్పకుండా వెళతారు. అయితే, ఈ కండలు తిరిగిన బామ్మను చూస్తే మాత్రం.. ‘ఇప్పుడు జిమ్కు వెళ్లి బాడీ పెంచి ఏం చేస్తాం లే..?’ అనుకునేవాళ్లంతా అర్జెంటుగా జిమ్లో చేరిపోవాలనుకుంటారు.
మీకు తెలిసిన వాళ్లలో.. 76ఏళ్ల వయసున్న మహిళలెవరైనా ఉన్నారా..? ఉంటే వారు ఎలా ఉన్నారు. దాదాపు అన్ని శరీర భాగాలు వదులైపోయి. నడవడానికే ఇబ్బంది పడుతూ ఉంటారు కదా..! చాలామంది అలాగే ఉంటారు. మూడు సంవత్సరాల క్రితం కెనడాకు చెందిన జొవాన్ మాక్డొనాల్డ్ కూడా అలాగే ఉండేది. అధిక బరువు, రక్తపోటుతో పాటు వృద్ధాప్యంలో వచ్చే జబ్బులతో ఇబ్బంది పడేది. 5.3 అడుగుల ఎత్తు 89కిలోల బరువు ఉండే ఆమె ఇప్పుడు ఈ వయసులో ఏకంగా 23కిలోలు తగ్గింది. కేవలం బరువు తగ్గటమే కాదు. కండలు తిరిగిన దేహంతో ఆమె ఒక జిమ్ మాస్టర్లా తయారైంది. నిత్యం జిమ్లో కఠోర సాధన చేయడమే ఇందుకు కారణం. అవసరం ఉన్న వారికి బాడీ బిల్డింగ్లో మెలకువలు కూడా నేర్పిస్తోంది. ‘ట్రైన్ విత్ జోవాన్’ అనే పేరుతో ఇన్స్టాగ్రామ్ పేజీ ద్వారా ఆమె పాఠాలు చెప్తోంది. ఆ పేజీలో ఆమెను ఏకంగా.. 5,00,000 అనుసరిస్తున్నారు. దీంతో ఆమె సోషల్ మీడియాలోనూ సెలబ్రిటీగా మారింది. ఎప్పటికప్పుడు తన జిమ్ వీడియోలతో పాటు ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకుంటున్న ఆమె ‘మీరు గడియారాన్ని వెనక్కి తిప్పలేరు, కానీ, దాన్ని ఓడించవచ్చు’ అని అంటోంది. సాఫీగా సాగిపోయే జీవితం కోసం ఆందోళన ఎందుకు.. సమస్యలను ఎదుర్కొనేందుకు బలం కూడగట్టుకుంటే మేలు కదా..! అందుకే ఆమె వృద్ధాప్యాన్ని సైతం ఓడించి కండలు పెంచుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శిరోముండనం కేసు.. హైకోర్టులో విచారణ వాయిదా
శిరోముండనం కేసులో విశాఖపట్నం కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. -
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీ పిటిషన్పై తీర్పు వాయిదా
సీఎం జగన్పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ కస్టడీ పిటిషన్పై తీర్పును విజయవాడ కోర్టు వాయిదా వేసింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి
ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయంలో చిన్న హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
పాటలతో రీల్స్.. మాటలతో మీమ్స్
లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే నామపత్రాల ప్రక్రియ జోరందుకొంది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు క్షేత్రస్థాయిలో తిరుగుతూ ప్రచారం చేస్తూనే సామాజిక మాధ్యమాల్లోనూ చురుగ్గా ఉంటున్నారు. -
భగభగ మండే
విపరీతమైన ఎండలకు మిర్యాలగూడ ప్రాంతం మాడిపోతోంది. సోమవారం మండల పరిధిలోని టీక్యాతండాలో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రత 45 డిగ్రీలు నమోదైంది. -
పట్టాలెక్కని ప్రతిపాదనలు
ఉమ్మడి జిల్లాలో రైల్వే శాఖాపరంగా అభివృద్ధికి అడుగులు పడాలని ప్రయాణికులు ఆశిస్తున్నారు. -
ప్రతి ఓటును ఒడిసిపట్టేలా..
సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని భారాస.. పాతికేళ్ల తర్వాత అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని కాంగ్రెస్... ఈసారి సత్తా చాటాలని భాజపా.. పక్కా వ్యూహంతో ముందుకు కదులుతున్నాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (23/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
‘చొరబాటుదారు’ వ్యాఖ్యలు.. మోదీపై ఫిర్యాదును పరిశీలిస్తున్నామన్న ఈసీ..!
-
వాట్సప్లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫొటోలు పంపించొచ్చు!
-
టీ20 వరల్డ్ కప్తో రీ ఎంట్రీ?.. తలుపులు మూసుకుపోయాయన్న సునీల్ నరైన్
-
రెడ్మీ కొత్త వైఫై ట్యాబ్.. రూ.20 వేలకే రోబో వాక్యూమ్ క్లీనర్
-
హనుమాన్ జన్మోత్సవ్.. ప్రశాంత్వర్మ ప్లాన్ మామూలుగా లేదుగా!
-
శిరోముండనం కేసు.. హైకోర్టులో విచారణ వాయిదా