తెదేపా ఎంపీపీ అభ్యర్థి ఇంట్లో మద్యం సీసాలు..

చిత్తూరు జిల్లా కేవీబీపురం మండలంలో తెదేపా ఎంపీపీ అభ్యర్థి మల్లికార్జునరెడ్డిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఈ రోజు తెల్లవారుజామున మల్లికార్జున రెడ్డి ఇంట్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో మద్యం

Published : 14 Mar 2020 12:04 IST

చిత్తూరు: చిత్తూరు జిల్లా కేవీబీపురం మండలంలో తెదేపా ఎంపీపీ అభ్యర్థి మల్లికార్జునరెడ్డిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఈ రోజు తెల్లవారుజామున మల్లికార్జున రెడ్డి ఇంట్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో మద్యం సీసాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.   మల్లికార్జునరావు ఇంట్లో మద్యం సీసాలు ఉన్నట్లు సమాచారం అందడంతో తనిఖీలు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. అయితే గుర్తుతెలియని వ్యక్తులు తన ఇంట్లో మద్యం సీసాలు పెట్టినట్లు మల్లికార్జునరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అధికార వైకాపా నేతలే తన ఇంట్లో మద్యం సీసాలు ఉంచారని ఆరోపించారు. మల్లికార్జునరెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు పుత్తూరు డీఎస్పీ కార్యాలయానికి తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని