కర్ణాటకలో మరో కరోనా కేసు

కర్ణాటకలో మరో కరోనా కేసు నమోదైంది. దీంతో మొత్తం కరోనా బాధితుల సంఖ్య ఏడుకు చేరింది. కరోనా లక్షణాలతో ఆదివారం ఓ మహిళ కలబురగి జిల్లా ఆసుపత్రిలో చేరింది. ఆమెకు వైద్య పరీక్షలు

Updated : 16 Mar 2020 00:07 IST

బెంగళూరు: కర్ణాటకలో మరో కరోనా కేసు నమోదైంది. దీంతో మొత్తం కరోనా బాధితుల సంఖ్య ఏడుకు చేరింది. కరోనా లక్షణాలతో ఆదివారం ఓ మహిళ కలబురగి జిల్లా ఆసుపత్రిలో చేరింది. ఆమెకు వైద్య పరీక్షలు చేయగా కరోనా ఉన్నట్లు నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆ రాష్ట్ర వైద్యారోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈనెల 10న కరోనాతో మరణించిన వ్యక్తి కుమార్తె ఈమె. సౌదీ అరేబియా నుంచి కలబురగికి వచ్చినట్లు అధికారులు గుర్తించారు. మృతుడి కుటుంబంలో ఉన్న నలుగురి సభ్యుల్లో ఒకరికి వైరస్‌ సోకినట్లు తేలింది. దీంతో ఆ ప్రాంతానికి ఐదు కిలోమీటర్ల మేర చుట్టూ బఫర్‌ జోన్‌గా ఆరోగ్య మంత్రి శ్రీరాములు ప్రకటించారు. భారత్‌లో ఇప్పటి వరకు కరోనా బాధితుల సంఖ్య 108కి చేరుకుంది.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని