గవర్నర్‌ను కలిసిన ఎస్‌ఈసీ

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమేశ్‌కుమార్‌ నేడు గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను కలవనున్నారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాకు గల కారణాలను వివరించనున్నారు.

Updated : 16 Mar 2020 14:02 IST

అమరావతి : రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమేశ్‌కుమార్‌ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను కలిశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాకు గల కారణాలను వివరించారు. ఏ పరిస్థితుల్లో  నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో గవర్నర్‌కు వివరించినట్లు సమాచారం. ఎస్‌ఈసీ నిర్ణయంపై ముఖ్యమంత్రి జగన్‌ ఇప్పటికే గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎస్‌ఈసీని రాజ్‌భవన్‌కు పిలిపించి గవర్నర్‌ మాట్లాడారు. ఎస్‌ఈసీతోపాటు ఐజీ సత్యనారాయణ గవర్నర్‌ను కలిశారు. దాదాపు 45 నిమిషాలపాటు ఈ భేటీ జరిగింది.

స్థానిక సంస్థల ఎన్నికలను 6 వారాలపాటు వాయిదా వేస్తూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదివారం సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. మరోవైపు ఎన్నికల వాయిదా నిర్ణయాన్ని ప్రకటించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమేశ్‌ కుమార్‌పై సీఎం జగన్‌ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎస్‌ఈసీపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని