
Updated : 16 Mar 2020 12:57 IST
ఎన్నికల వాయిదా: సుప్రీంకు ఏపీ ప్రభుత్వం
అమరావతి: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఎన్నికల వాయిదా అంశాన్ని జస్టిస్ లలిత్ ధర్మాసనం ముందు ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాది ప్రస్తావించారు. దీనిపై జస్టిస్ లలిత్ స్పందిస్తూ రేపటి కేసుల జాబితాలో చేర్చాలని సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా కరోనా వైరస్ పేరుతో ఆరువారాలపాటు ఎన్నికలను వాయిదా వేయడంపై సుప్రీంను ఏపీ ప్రభుత్వం ఆశ్రయించింది. దీనిపై రేపు సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది.
Tags :