ఎన్నికల వాయిదా: సుప్రీంకు ఏపీ ప్రభుత్వం

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఎన్నికల వాయిదా అంశాన్ని జస్టిస్‌ లలిత్‌ ధర్మాసనం ముందు...

Updated : 16 Mar 2020 12:57 IST

అమరావతి: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఎన్నికల వాయిదా అంశాన్ని జస్టిస్‌ లలిత్‌ ధర్మాసనం ముందు ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాది ప్రస్తావించారు. దీనిపై జస్టిస్‌ లలిత్‌ స్పందిస్తూ రేపటి కేసుల జాబితాలో చేర్చాలని సుప్రీంకోర్టు రిజిస్ట్రార్‌ను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా కరోనా వైరస్‌ పేరుతో ఆరువారాలపాటు ఎన్నికలను వాయిదా వేయడంపై సుప్రీంను ఏపీ ప్రభుత్వం ఆశ్రయించింది. దీనిపై రేపు సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు