
నిర్భయ దోషి పిటిషన్ కొట్టివేత
దిల్లీ: నిర్భయ హత్యాచారం కేసులో దోషులకు మరికొన్ని రోజుల్లో శిక్ష అమలు కావాల్సి ఉంది. ఈ క్రమంలో దోషుల్లో ఒకరైన ముకేశ్సింగ్ సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. క్యురేటివ్, మెర్సీ పిటిషన్లను పునరుద్ధరించాలని కోరాడు. సోమవారం ఆ పిటిషన్ను సర్వోన్నత న్యాయస్థానం పరిశీలించింది. ముకేశ్ చేసిన అభ్యర్థనను కొట్టివేసింది. ఈ పిటిషన్ పరిశీలించదగింది కాదని సుప్రీం పేర్కొంది. కాగా.. ఈ కేసులో దోషులకు శిక్ష ఇప్పటికే మూడుసార్లు వాయిదా పడింది. తాజాగా ఈనెల 20న ఉదయం 5.30గంటలకు దోషులను ఉరితీయాలని పటియాలా కోర్టు డెత్వారెంట్లు జారీ చేసింది. దోషుల అభ్యర్థనలను రాష్ట్రపతితో పాటు సుప్రీం కోర్టు కూడా తిరస్కరించింది. దీంతో వాళ్లకు శిక్ష నుంచి తప్పించుకునే మార్గాలు మూసుకుపోయాయి. కేసులో ముకేశ్సింగ్తో పాటు దోషులుగా ఉన్న అక్షయ్, వినయ్శర్మ, పవన్గుప్తా ఉరికంబం ఎక్కనున్నారు.