ఏపీలో ‘కోడ్’ సడలింపు..ఆదేశాలు జారీ
స్థానిక ఎన్నికల నేపథ్యంలో విధించిన ఎన్నికల కోడ్ను రాష్ట్ర ఎన్నికల సంఘం సడలించింది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో కోడ్ సడలింపునకు సంబంధించిన ఆదేశాలను జారీ చేసింది. మరోవైపు సుప్రీంకోర్టులో బుధవారం జరిగిన విచారణకు సంబంధించిన తీర్పు...
అమరావతి: స్థానిక ఎన్నికల నేపథ్యంలో విధించిన ఎన్నికల కోడ్ను రాష్ట్ర ఎన్నికల సంఘం సడలించింది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో కోడ్ సడలింపునకు సంబంధించిన ఆదేశాలను జారీ చేసింది. మరోవైపు సుప్రీంకోర్టులో బుధవారం జరిగిన విచారణకు సంబంధించిన తీర్పు కాపీ విడుదలైంది. తీర్పు కాపీలో విచారణలో ప్రస్తావనకు వచ్చిన అంశాలను పేర్కొంది. స్థానిక ఎన్నికల వాయిదాపై జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఎన్నికలను వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) తీసుకున్న నిర్ణయంపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనిపై రాష్ట్ర ఎన్నికల సంఘం సైతం కేవియట్ దాఖలు చేసింది. బుధవారం ఈ అంశంపై అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది.
ఈ పిటిషన్పై విచారణలో భాగంగా ఏపీ ప్రభుత్వం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ వాదనలు వినిపించారు. ఎన్నికల కోడ్తో అభివృద్ధి పనులు ఆగాయని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. ఎన్నికలను వాయిదా వేసి కోడ్ కొనసాగించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం కొత్త ఎన్నికల తేదీకి 4 వారాల ముందు కోడ్ అమల్లోకి తేవాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. తదుపరి తేదీ ఖరారుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలని ఎస్ఈసీకి సూచించింది. దీంతో పాటు రాష్ట్రంలో ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు చేపట్టాలంటే ఎస్ఈసీ అనుమతి తీసుకోవాలని ఆదేశించింది. ఈ పిటిషన్పై విచారణ ముగిసినట్లు తీర్పు కాపీలో న్యాయస్థానం స్పష్టం చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వినాసికారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
కిడ్నాప్ చేయించి.. 30 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్
-
పద్మవ్యూహంలో ఉన్నా.. నావైపూ చూడండి
-
నాడు అధికారులు.. నేడు అభ్యర్థులు!
-
నిప్పుల గుండంలా తెలంగాణ.. ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే..
-
నటుడు మన్సూర్ అలీఖాన్కు అస్వస్థత.. పండ్లరసంలో విషం కలిపారని ఆరోపణ
-
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లో పగులుతున్న అద్దాలు.. అంతుచిక్కని అనుమానాలు