‘కరోనా’పై హైదరాబాద్ పోలీసుల అవగాహన
ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కరోనా వైరస్ వ్యాప్తిపై రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ట్రాఫిక్ పోలీసులు అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. నగరంలోని ప్రధాన కూడళ్లు, సిగ్నల్స్
హైదరాబాద్: ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కరోనా వైరస్ వ్యాప్తిపై రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ట్రాఫిక్ పోలీసులు అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. నగరంలోని ప్రధాన కూడళ్లు, సిగ్నల్స్ వద్ద ప్రజలకు అవగాహన కల్పించారు. వ్యక్తిగత శుభ్రతతోపాటు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. రాచకొండ సీపీ మహేశ్ భగవత్ ఆదేశాల మేరకు కొత్తపేట కూడలి వద్ద వాహనదారులను ఆపి వినూత్న పద్ధతిలో అవగాహన కల్పించారు. చేతులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని చెప్పారు. చేతులను ఎలా శుభ్రం చేసుకోవాలో కూడా ప్రదర్శన రూపంలో చూపించారు. తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలను వివరించారు. మనుషుల మధ్య మీటరు దూరం పాటించాలని.. అదేవిధంగా షేక్హ్యాండ్ ఇవ్వకుండా నమస్కారం పెట్టాలని సూచించారు. వ్యక్తిగత పరిశుభ్రతతోనే కరోనాని నియంత్రించగలమని.. అందుకే అందరూ పరిశుభ్రతను పాటించాల్సిందిగా ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వినాసికారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ఈసీ నిబంధనలకు విరుద్ధంగా వైకాపా సోషల్ మీడియా తీరు
-
హైదరాబాద్ విమానాశ్రయంలో ఏఏఐ వాటా విక్రయం?
-
20 నుంచి పవన్ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం
-
మహిళకు శస్త్రచికిత్స చేసి.. తల్లీ బిడ్డను కాపాడిన దర్శి అభ్యర్థి
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు