విద్యార్థుల ఇంటికే మధ్యాహ్న భోజనం.!

కరోనా వ్యాప్తిని నివారించేందుకు ముందు జాగ్రత్త చర్యగా దేశంలోని చాలా రాష్ట్రాలు ఇప్పటికే పాఠశాలలకు సెలవులు ప్రకటించాయి. కొన్ని రాష్ట్రాలు పరీక్షలు సైతం రద్దు చేసి విద్యార్థులకు తర్వాతి తరగతి ఉన్నతి కల్పించాయి.

Published : 19 Mar 2020 18:17 IST

దిల్లీ: కరోనా వ్యాప్తిని నివారించేందుకు ముందు జాగ్రత్త చర్యగా దేశంలోని చాలా రాష్ట్రాలు ఇప్పటికే పాఠశాలలకు సెలవులు ప్రకటించాయి. కొన్ని రాష్ట్రాలు పరీక్షలు సైతం రద్దు చేసి విద్యార్థులకు తర్వాతి తరగతి ఉన్నతి కల్పించాయి. కాగా.. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజన పథకాన్ని ఈ క్లిష్టకాలంలోనూ కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సెలవు రోజుల్లో విద్యార్థులు పౌష్టికాహారానికి దూరంగా ఉండకూడదన్న లక్ష్యంలో ఇప్పటికే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టింది. ఈమేరకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆయా రాష్ట్రాలకు సూచించనుంది. వండిన భోజనం నేరుగా ఇంటికి సరఫరా చేయడం లేదా విద్యార్థుల తల్లిదండ్రుల బ్యాంకుఖాతాలో నగదు జమ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరాలని నిర్ణయించింది. ‘అనుకోని పరిస్థితుల్లో పాఠశాలలకు సెలవులు ఇస్తే విద్యార్థులకు చెందాల్సిన మధ్యాహ్న భోజనం అందించాలని నిబంధనల్లో ఉంది. అందుకే ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతున్నాం. ఏదేమైనా విద్యార్థులకు ప్రతిఫలం అందిస్తాం’ అని అధికారులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని