శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీ బందోబస్తు
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్జీఐఏ)లో భారీగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులను క్వారంటైన్కు తరలిస్తు్న్న తరుణంలో కొంతమంది విదేశీయులు నిర్బంధ పరిశీలన కేంద్రాలకు...
హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్జీఐఏ)లో భారీగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులను క్వారంటైన్కు తరలిస్తు్న్న తరుణంలో కొంతమంది విదేశీయులు నిర్బంధ పరిశీలన కేంద్రాలకు వెళ్లేందుకు నిరాకరించే అవకాశం ఉన్నందున పోలీసులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కొంతమంది ప్రయాణికులు విదేశాల నుంచి వస్తున్నా మాట మార్చి పక్క రాష్ట్రాల నుంచి వస్తున్నట్లుగా అధికారులను నమ్మిస్తున్నారు. ఐదు రోజుల క్రితం ఇలా కొంతమంది ప్రయాణికులు థర్మల్ స్క్రీనింగ్ చేయించుకోకుండా వెళ్లిపోవడంతో ఆర్జీఐఏలో థర్మల్ స్క్రీనింగ్ నిర్వహణపై సర్వత్రా విమర్శలు వెళ్లువెత్తాయి.
తాజాగా ఆర్జీఐఏలో పరిస్థితులను చక్కదిద్దేందుకు సైబరాబాద్ సీపీ సజ్జనార్ నేరుగా రంగంలోకి దిగారు. అక్కడ ఏర్పాటు చేసిన థర్మల్ స్క్రీనింగ్ కేంద్రాన్ని స్వయంగా పరిశీలిస్తున్న ఆయన ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. క్వారంటైన్కు తరలిస్తున్న ప్రయాణికుల వివరాలను ఎప్పటికప్పుడు తనకు తెలియజేయాలని పోలీసు అధికారులను సీపీ ఆదేశించారు. ప్రస్తుతం ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు, వారిని తీసుకెళ్లేందుకు వచ్చే వాహనాలను మాత్రమే విమానాశ్రయంలోకి అనుమతిస్తున్నారు. విదేశాల నుంచి వచ్చే విమానాలను హజ్ టెర్మినల్ వద్దే నిలుపుతున్నారు. అంతర్జాతీయ విమానాల్లో వచ్చే ప్రయాణికులను తీసుకెళ్లేందుకు వచ్చే వారి బంధువులు, కుటుంబసభ్యులు హజ్ టెర్మినల్ వద్దకే రావాలని విమానాశ్రయ అధికారులు సూచిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి
ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయంలో చిన్న హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
పాటలతో రీల్స్.. మాటలతో మీమ్స్
లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే నామపత్రాల ప్రక్రియ జోరందుకొంది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు క్షేత్రస్థాయిలో తిరుగుతూ ప్రచారం చేస్తూనే సామాజిక మాధ్యమాల్లోనూ చురుగ్గా ఉంటున్నారు. -
భగభగ మండే
విపరీతమైన ఎండలకు మిర్యాలగూడ ప్రాంతం మాడిపోతోంది. సోమవారం మండల పరిధిలోని టీక్యాతండాలో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రత 45 డిగ్రీలు నమోదైంది. -
పట్టాలెక్కని ప్రతిపాదనలు
ఉమ్మడి జిల్లాలో రైల్వే శాఖాపరంగా అభివృద్ధికి అడుగులు పడాలని ప్రయాణికులు ఆశిస్తున్నారు. -
ప్రతి ఓటును ఒడిసిపట్టేలా..
సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని భారాస.. పాతికేళ్ల తర్వాత అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని కాంగ్రెస్... ఈసారి సత్తా చాటాలని భాజపా.. పక్కా వ్యూహంతో ముందుకు కదులుతున్నాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (23/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా
-
ఇన్స్టంట్ ఇ-పాన్ కావాలా..? ఉచితంగా పొందండిలా..
-
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!
-
ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాను.. అల్లు అర్జున్పై ‘కేజీఎఫ్’ నటుడు ప్రశంసలు..
-
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య