‘‘హోమ్క్వారంటైన్’’తోనే కరోనా నివారణ
ప్రపంచం మొత్తం కరోనావైరస్తో కల్లోలం అవుతోంది. ఒకరినుంచి ఒకరికి ప్రత్యక్షంగా వ్యాపిస్తున్న ఈ వైరస్ను కట్టడి చేయాలంటే బాధిత వ్యక్తి
ఇంటర్నెట్డెస్క్: ప్రపంచం మొత్తం కరోనావైరస్తో కల్లోలం అవుతోంది. ఒకరినుంచి ఒకరికి ప్రత్యక్షంగా వ్యాపిస్తున్న ఈ వైరస్ను కట్టడి చేయాలంటే బాధిత వ్యక్తి జనసమూహంలోకి వెళ్లకుండా నివారించడం ఒక్కటే మార్గం. మనదేశంలో నమోదవుతున్న కేసులన్నీ ఇక్కడికి వస్తున్న విదేశీయులనుంచో లేదా తిరిగొస్తున్న భారతీయుల వల్లనో నమోదవుతున్నాయి. అలా వచ్చినవారు 14 రోజులుపాటు హోమ్క్వారంటైన్(స్వీయ గృహనిర్భంధం)లో ఉండాలని ప్రభుత్వం సూచిస్తోంది. దీనివల్ల వారు వైరస్ ప్రభావానికి గురయ్యారో లేదో తెలుస్తుంది. అయితే ఇక్కడే చిక్కొచ్చింది. విదేశాల నుంచి వచ్చినవారు ప్రభుత్వాదేశాలను బేఖాతరు చేస్తూ సమాజంలో తిరుగుతున్నారు. దీంతో భారత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. అదే చేతిపై స్టాంపింగ్..
అంటే ఏమిటి..?
విదేశాల నుంచి వచ్చినవారిని ఎయిర్పోర్టలోనే కొవిడ్-19 నిర్థారిత పరీక్షలు చేసి ఆ లక్షణాలు ఎక్కువ మోతాదులో కనిపించిన వారిని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డులకు తరలిస్తున్నారు. ఆ లక్షణాలు లేనివారికి అరచేతి వెనుకవైపు చెరిగిపోనివిధంగా నీలంరంగు స్టాంపును ముద్రిస్తున్నారు. దీనిపై తేదితోపాటు ‘హోమ్ క్వారంటైన్’ తీసుకొవాల్సిందిగా సూచిస్తూ రాసి ఉంటుందని ఎయిమ్స్ డైరెక్టర్ డా. రణదీప్ గులేరియా తెలిపారు. కరోనా బాధితుల సంఖ్య పెరుగుతున్న కొద్ది ఆసుపత్రులలో బెడ్ల సమస్య ఏర్పడుతుంది. అనుమానం ఉన్న ప్రతిఒక్కరిని ఆసుపత్రిలో ఉంచితే అవి చాలవు, అందుకే ఎవరికివారు స్వీయగృహనిర్బంధం చేసుకోవడం అవసరమని ఆయన సూచించారు. అలాగే ఎయిమ్స్, సఫ్దార్జంగ్ ఆసుపత్రులలో ఇతర శస్త్రచికిత్సలకు సంబంధించి అపాయింట్మెంట్లను కూడా రద్దుచేసినట్టు ఆయన తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో రెండు కెమెరాలతో నిఘా: సీఈవో మీనా
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో రెండు కెమెరాలతో పర్యవేక్షణ ఉంటుందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్ కుమార్ మీనా తెలిపారు. -
ఆన్లైన్లోనూ నామినేషన్ వేయొచ్చు: వికాస్ రాజ్
లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఆన్లైన్లోనూ నామినేషన్ దాఖలు చేయవచ్చని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఏపీ, తెలంగాణకు సాగర్ నీటి విడుదలపై కేఆర్ఎంబీ ఉత్తర్వులు
వేసవిలో తాగునీటి అవసరాల కోసం కృష్ణానది యాజమాన్య బోర్డు నీటి విడుదల ఉత్తర్వులు జారీ చేసింది. -
గరిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం: వాతావరణ శాఖ
రాష్ట్రంలో గురు, శుక్రవారాల్లో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వడగాల్పులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. -
భద్రాచలంలో కనులపండువగా శ్రీరామ మహా పట్టాభిషేకం
శ్రీరామ మహా పట్టాభిషేక మహోత్సవ వేడుకతో గురువారం భద్రగిరి దివ్యక్షేత్రం పులకించింది. వేద మంత్రోచ్ఛరణల మధ్య సింహాసనాన్ని అధిష్ఠించిన రామచంద్రుడు భక్తకోటికి నేనున్నానంటూ కొండంత అభయమిచ్చాడు. -
జగన్పై రాయి దాడి కేసు.. ఆ ఆరుగురి వివరాలు తెలపాలంటూ కోర్టులో పిటిషన్
సీఎం జగన్పై రాయి దాడి వ్యవహారంపై విజయవాడ కోర్టులో పిటిషన్ దాఖలైంది. పోలీసుల అదుపులో ఉన్న ఆరుగురి వివరాలు తెలపాలంటూ న్యాయవాది సలీం ఈ పిటిషన్ వేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
దుబాయ్లో వర్షాలు.. భారతీయుల కోసం హెల్ప్లైన్ నంబర్లు
-
ఐపీఎల్లో ఆ రూల్ నాకు నచ్చలేదు: రోహిత్ శర్మ
-
ఇన్ఫీ లాభం 30 శాతం జంప్.. ఒక్కో షేరుపై ₹28 డివిడెండ్
-
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో రెండు కెమెరాలతో నిఘా: సీఈవో మీనా
-
సినిమాల్లేక ఖాళీగా కూర్చొనే వాళ్లే అలా ఆలోచిస్తారు: విశాల్
-
స్వదేశంలో జోఫ్రా ఆర్చర్ వరల్డ్ కప్ ఆడటం కష్టమేనా..?