కరోనా ఎఫెక్ట్: కళ తప్పిన సందర్శక ప్రాంతాలు
పర్యాటకం.. మనసుకు ఉల్లాసాన్ని.. శరీరానికి కొత్త శక్తిని ఇచ్చే ఔషధం. అందుకే చాలా మంది కాస్త సమయం దొరికితే చాలు.. బ్యాగ్ సర్దుకొని పర్యాటక ప్రాంతాలకు చెక్కేస్తుంటారు. కానీ మహమ్మారి
పర్యాటకం.. మనసుకు ఉల్లాసాన్ని.. శరీరానికి కొత్త శక్తిని ఇచ్చే ఔషధం. అందుకే చాలా మంది కాస్త సమయం దొరికితే చాలు.. బ్యాగ్ సర్దుకొని పర్యాటక ప్రాంతాలకు చెక్కేస్తుంటారు. కానీ మహమ్మారి కరోనా వైరస్ వల్ల పర్యాటక రంగం తీవ్రంగా దెబ్బతింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచ దేశాల ఆంక్షలు.. వైరస్ భయంతో పర్యటకులు సందర్శక ప్రాంతాలకు వెళ్లేందుకు పెద్దగా మొగ్గుచూపట్లేదు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ సందర్శక ప్రాంతాలన్నీ వెలవెలబోతున్నాయి. కరోనా వైరస్ రాకముందు.. వచ్చిన తర్వాత సందర్శక ప్రాంతాలు ఎలా ఉన్నాయో ఒక్కసారి చూస్తే...
చైనా వాల్.. ఇప్పుడు నిల్
చైనా గోడ.. ప్రపంచ ఏడు వింతల్లో ఒకటి. దీనిని చూడటానికి ప్రతి రోజు వేల సంఖ్యలో సందర్శకులు వస్తుంటారు. రెండు నెలల క్రితం నూతన సంవత్సర వేడుకలు కూడా ఇక్కడ ఘనంగా నిర్వహించారు. కానీ ఆ దేశంలో కరోనా వైరస్ పుట్టుకొచ్చి దేశాన్ని అతలాకుతలం చేసింది. దీంతో కరోనా నియంత్రణలో భాగంగా ప్రభుత్వం చైనా గోడను మూసివేసింది. దీంతో ఇప్పుడు ఆ ప్రాంతం నిర్మానుష్యంగా మారింది.
ది టెంపుల్ ఆఫ్ హెవెన్.. ఇప్పుడు వెలవెలబోయెన్
చైనా రాజధాని బీజింగ్లో ‘ది టెంపుల్ ఆఫ్ హెవెన్’ అనే ప్రముఖ పుణ్యక్షేత్రం ఉంది. చైనా సంస్కృతిని తెలుసుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా అనేక మందిఇక్కడికి వస్తుంటారు. అయితే ఇటీవల ఆ దేశంలో విజృంభించిన కరోనా వైరస్ కారణంగా 3వేల మందికిపైగా చైనీయులు మృతి చెందారు. 80వేల మందికిపైగా కరోనా బారినపడ్డారు. నియంత్రణ చర్యలో భాగంగా ఆ దేశంలో పర్యాటకం మూతపడింది. సందర్శకుల రాక నిలిచిపోవడంతో ది టెంపుల్ ఆఫ్ హెవెన్ వెలవెలబోతోంది.
ఇటలీ.. సందర్శక ప్రాంతాలు ఖాళీ
అత్యధికంగా పర్యటకులు వెళ్లే ప్రాంతం ఇటలీ. ప్రస్తుతం కరోనా వ్యాప్తి విషయంలోనూ అత్యధికంగా ప్రభావితమవుతున్న దేశం కూడా అదే. కరోనా వ్యాప్తికి ముందు ఇటలీలోని ట్రెవి ఫౌంటెన్ వద్ద రోజుకు వేల సంఖ్యలో సందర్శకులు వచ్చేవారు. ఇప్పుడు కరోనా వల్ల సందర్శకుల తాకిడి బాగా తగ్గింది. కొంతమంది మాస్కులు.. ముందస్తు జాగ్రత్తలు వహిస్తూ ఫౌంటెన్ను సందర్శిస్తున్నారు.
టైమ్స్ స్క్వేర్.. జీరో పీపుల్
ప్రపంచంలో అత్యధికంగా రద్దీ ఉండే ప్రాంతాల్లో న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ ఒకటి. అక్కడ పరిసర ప్రాంతాల్లో దుకాణాలు, రెస్టారెంట్స్, ఆఫీస్లు ఎక్కువగా ఉండటంతో నిత్యం రద్దీగా ఉంటుంది. ఎప్పుడు చూసినా కాలు పెట్టే సందు లేకుండా ప్రజలు నడుస్తూ కనిపిస్తారు. కానీ కరోనా మహమ్మారి దెబ్బకి ఆ ప్రాంతానికి మనుషులు రావడం మానేశారు. దీంతో రోడ్లన్ని ఖాళీగా దర్శనమిస్తున్నాయి. జనాలతో నిండిపోయే గ్రాండ్ సెంట్రల్ టెర్మినల్, సబ్వేలు కూడా కరోనా ప్రభావంతో కళ తప్పాయి.
డిస్నీపార్క్స్.. చడిచప్పుడు లేదు
పిల్లలకు ఎంతో ఇష్టమైన డిస్నీపార్కులు కూడా కరోనా దెబ్బకు మూతపడ్డాయి. కరోనా వ్యాప్తి దృష్ట్యా నార్త్ అమెరికాలో ఉన్న డిస్నీపార్కులు, హోటల్స్, స్టోర్స్ను మూసివేస్తున్నట్లు డిస్నీ యాజమాన్యం తెలిపింది. దీంతో రోజు పిల్లలతో సందడిగా ఉండే పార్కులు ఇప్పుడు మూగబోయాయి.
సందర్శకులు లేని తాజ్మహల్.. భక్తులు లేని తిరుమల
భారత్లోనూ కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. కరోనా వ్యాప్తి దృష్ట్యా పలు సందర్శక ప్రాంతాలను రాష్ట్ర ప్రభుత్వాలు మూసివేస్తున్నాయి. దీంతో ప్రపంచ ఏడు వింతల్లో ఒకటైన తాజ్మహల్ కూడా సందర్శకులు లేక బోసిపోతోంది. అలాగే నిత్యం భక్తులతో కిటకిటలాడే తిరుమల పుణ్యక్షేత్రాన్ని కూడా కరోనా వ్యాప్తి దృష్ట్యా మూసివేశారు. శ్రీవారం దర్శనం నిలిపివేయడంతో భక్తులు లేక తిరుమల వీధులన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి.
- ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి
ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయంలో చిన్న హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
పాటలతో రీల్స్.. మాటలతో మీమ్స్
లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే నామపత్రాల ప్రక్రియ జోరందుకొంది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు క్షేత్రస్థాయిలో తిరుగుతూ ప్రచారం చేస్తూనే సామాజిక మాధ్యమాల్లోనూ చురుగ్గా ఉంటున్నారు. -
భగభగ మండే
విపరీతమైన ఎండలకు మిర్యాలగూడ ప్రాంతం మాడిపోతోంది. సోమవారం మండల పరిధిలోని టీక్యాతండాలో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రత 45 డిగ్రీలు నమోదైంది. -
పట్టాలెక్కని ప్రతిపాదనలు
ఉమ్మడి జిల్లాలో రైల్వే శాఖాపరంగా అభివృద్ధికి అడుగులు పడాలని ప్రయాణికులు ఆశిస్తున్నారు. -
ప్రతి ఓటును ఒడిసిపట్టేలా..
సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని భారాస.. పాతికేళ్ల తర్వాత అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని కాంగ్రెస్... ఈసారి సత్తా చాటాలని భాజపా.. పక్కా వ్యూహంతో ముందుకు కదులుతున్నాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (23/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!
-
ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాను.. అల్లు అర్జున్పై ‘కేజీఎఫ్’ నటుడు ప్రశంసలు..
-
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
-
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి
-
జైల్లో కేజ్రీవాల్కు ఇన్సులిన్.. మరి ఇప్పుడు ఎందుకు ఇచ్చారన్న ఆప్
-
టీ20 వరల్డ్ కప్లో ఓపెనర్లుగా గంగూలీ ఛాయిస్ వీళ్లే..!