రేపు హైదరాబాద్‌ మెట్రో సేవలు బంద్‌

జనతా కర్ఫ్యూలో భాగంగా రేపు మెట్రో రైలు సేవలు నిలిపివేయాలని హైదరాబాద్‌ మెట్రో రైల్‌ అధికారులు నిర్ణయించారు. కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు ...

Updated : 21 Mar 2020 15:59 IST

హైదరాబాద్‌: జనతా కర్ఫ్యూలో భాగంగా రేపు మెట్రో రైలు సేవలు నిలిపివేయాలని హైదరాబాద్‌ మెట్రో రైల్‌ అధికారులు నిర్ణయించారు. కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఇప్పటికే ప్రయాణికులకు ఈ సంస్థ అవగాహన కల్పిస్తోంది. మరోవైపు దిల్లీ మెట్రో సేవలను సైతం నిలిపివేస్తున్నట్టు నిన్న ఆ సంస్థ ప్రకటించిన విషయం తెలిసిందే.

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఆదివారం జనతా కర్ఫ్యూ పాటించాలని ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. ప్రధాని పిలుపుమేరకు జనతా కర్ఫ్యూను విజయవంతం చేసేందుకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని