విదేశాలకు వెళ్లకుండానే కరోనా సోకింది
కరోనా వైరస్ ఒకరి నుంచి ఒకరికి సోకుతుంది. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్య్లూహెచ్వో) చెబుతున్న మాట. ఈక్రమంలోనే చైనాలోని ఓ పట్టణంలో పుట్టిన ఈ మహమ్మారి ప్రస్తుతం ప్రపంచ దేశాలను వణికిస్తోంది.
పుణె(మహారాష్ట్ర): కరోనా వైరస్ ఒకరి నుంచి ఒకరికి సోకుతుంది. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్య్లూహెచ్వో) చెబుతున్న మాట. ఇప్పటి వరకూ బయటపడ్డ కేసులన్నీ అలాంటివే. విదేశాలకు వెళ్లి రావడం లేక విదేశీయులతో కలిసి ఉండటం వల్ల వచ్చినవే. అందుకే ప్రభుత్వం ఎక్కువగా విదేశాల నుంచి వచ్చిన వారిపై దృష్టి పెట్టింది. అయితే, మహారాష్ట్రలోని పుణెలో ఒక విచిత్రమైన కేసు నమోదైంది. 40 ఏళ్ల ఓ స్థానిక మహిళకు వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. ఆమె ఏ విదేశానికి వెళ్లలేదు. విదేశాల నుంచి వచ్చినవారెవరూ తన ఇంటికి రాలేదు. ఆమె గత కొంతకాలంగా గొంతు నొప్పితో బాధపడుతున్నారు. ఈ కారణంగా ఇంట్లోనే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఆసుపత్రికి వెళ్లారు. స్వైన్ ఫ్లూ వచ్చిందేమో అన్న అనుమానంతో డాక్టర్లు ఆమెకు వైద్య పరీక్షలు చేశారు. చివరకు కరోనా ఉన్నట్లు నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆమెను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలో వెంటిలేటర్పై ఉంచారు.
ఈ విషయంపై జిల్లా కలెక్టర్ నవల్ కిషోర్రామ్ మాట్లాడుతూ.. ‘మార్చి 3న నవీ ముంబయిలోని వాషీ అనే ప్రాంతంలో జరిగిన ఓ వివాహ వేడుకకు ఆమె హాజరయ్యారు. ఆ సమయంలో కరోనా బాధితులను ఆమె కలిసి ఉండవచ్చని అనుమానిస్తున్నాం. ఇలాంటి కేసులు పరిష్కరించడానికి మాకు ప్రత్యేక మార్గదర్శకాలు ఉన్నాయి. సదరు మహిళ క్యాబ్లో ముంబయికి చేరుకున్న సమయంలో ఎవరితో కలిశారు అనే వివరాలనూ సేకరిస్తున్నాం. కేసు దర్యాప్తు చేస్తున్నాం’ అని ఆయన తెలిపారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసు వివరాలను అధికారికంగా ప్రకటించలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ దేవరకొండను పార్టీ అడిగిన రష్మిక.. ఎందుకంటే..?
-
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు!
-
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!
-
ముఖ్యమంత్రితో ముఖాముఖిలో వాలంటీరు