వైద్య సిబ్బంది కోసం ₹కోటి విరాళం

కరోనా వైరస్‌ విస్తృతమవుతున్న వేళ పీపుల్‌ కంబైన్‌ ఫౌండేషన్‌ దాతృత్వం చాటుకుంది. కరోనా నియంత్రణకు సేవలందిస్తున్న వైద్య సిబ్బంది కోసం భూరి విరాళం ప్రకటించింది.

Published : 21 Mar 2020 19:27 IST

హైదరాబాద్‌: కరోనా వైరస్‌ విస్తృతమవుతున్న వేళ పీపుల్‌ కంబైన్‌ ఫౌండేషన్‌ దాతృత్వం చాటుకుంది. కరోనా నియంత్రణకు సేవలందిస్తున్న వైద్య సిబ్బంది కోసం భూరి విరాళం ప్రకటించింది. తెలంగాణ సీఎం సహాయ నిధికి కోటి రూపాయల విరాళం అందించింది. ఈ మేరకు సంబంధిత చెక్కును మంత్రి కేటీఆర్‌కు ఫౌండేషన్‌ ప్రతినిధులు నాగ ప్రసాద్ తుమ్మల, రాజ్ యార్లగడ్డ అందజేశారు. కరోనాపై పోరాటం చేస్తున్న వైద్య సిబ్బందికి కృతజ్ఞత తెలపాలన్న ప్రధాని పిలుపునకు ఫౌండేషన్‌ స్పందించి ఆర్థికసాయానికి ముందుకొచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని