చాలని పడకలు.. దూరం పాటించండి
దేశంలోని కీలక, అత్యవసర వ్యవస్థల్లోని లోపాలను కరోనా వైరస్ ఎత్తిచూపుతోంది. పరిస్థితి విషమిస్తే ఎదుర్కోగల సమర్థతను ప్రశ్నార్థకం చేస్తోంది. ‘మహమ్మారిని ఎదుర్కోగల సదుపాయాలు భారత వైద్యరంగానికి ఉన్నాయా?’ అన్న పేరుతో బ్రూకింగ్స్ ఇండియా ఓ నివేదిక విడుదల చేసింది. కరోనా మూడో దశలోకి...
దిల్లీ: దేశంలోని కీలక, అత్యవసర వ్యవస్థల్లోని లోపాలను కరోనా వైరస్ ఎత్తిచూపుతోంది. పరిస్థితి విషమిస్తే ఎదుర్కోగల సమర్థతను ప్రశ్నార్థకం చేస్తోంది. ‘మహమ్మారిని ఎదుర్కోగల సదుపాయాలు భారత వైద్యరంగానికి ఉన్నాయా?’ అన్న పేరుతో బ్రూకింగ్స్ ఇండియా ఓ నివేదిక విడుదల చేసింది. కరోనా మూడో దశలోకి చేరితే ఆస్పత్రుల్లో పనిముట్లు, యంత్రాలు, పడకల కొరత విపరీతంగా ఉంటుందని హెచ్చరించింది.
ప్రధానమంత్రి ఆర్థిక సలహాదారు మండలి మాజీ సభ్యుడైన షామిక రవి ఈ నివేదికకు సహ రచయిత. దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో 7,13,986 పడకలు మాత్రమే అందుబాటులో ఉన్నాయని నివేదిక తెలిపింది. అంటే వెయ్యిమందికి కేవలం 0.55 మాత్రమే అన్నమాట. ‘ప్రభుత్వ ఆస్పత్రుల్లో పడకలు మరీ మరీ తక్కువగా ఉన్నాయి. కరోనా వైరస్లాంటి మహమ్మారి విజృంభిస్తే పరిస్థితులు సంక్లిష్టంగా మారతాయి. వెంటిలేటర్ వంటి సదుపాయాలు కనీసం 5-10 శాతం అవసరం ఉంటుందని అంచనా’ అని నివేదిక సారాంశం.
నేషనల్ హెల్త్ ప్రొఫైల్-2019ను ఉదహరిస్తూ 12 రాష్ట్రాల్లో జాతీయ స్థాయి కన్నా తక్కువ పడకలు ఉన్నాయని నివేదిక ఉటంకించింది. ఇందులో బిహార్, ఝార్ఖండ్, గుజరాత్, ఉత్తర్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, హరియాణా, మహారాష్ట్ర, ఒడిశా, అస్సాం, మణిపూర్ రాష్ట్రాలు ఉన్నాయి. బిహార్లో 1000 మందికి కేవలం 0.11 పడకలు మాత్రమే ఉన్నాయి. అయితే పశ్చిమ్బంగా (1000కి 2.25 పడకలు), సిక్కిం (2.32), దిల్లీ (1.05), కేరళ (1.05), తమిళనాడు (1.1) కొంత మెరుగ్గా ఉన్నాయి.
సామాజిక దూరం, వ్యక్తిగత జాగ్రత్తలు పాటించడం వల్ల ఆస్పత్రుల్లో పడకల అవసరం తగ్గుతుందని నివేదిక వెల్లడించింది. వెంటిటేలర్లు, పడకలను ఆగమేఘాల మీద ఏర్పాటు చేయాలని కోరింది. ప్రైవేటు వైద్యశాలల్లోని పడకలను ప్రభుత్వం వాడుకోవాలని సూచించింది. వీలైనంత త్వరగా ఆర్మీ శిబిరాల్లో ఆస్పత్రి పడకలను ఏర్పాటు చేయాలని కోరింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
లోక్సభ ఎంపీల్లో 225 మందిపై క్రిమినల్ కేసులు: ఏడీఆర్
-
బాబాయిని చంపిన వ్యక్తికి ఎంపీ టికెట్.. చెల్లెలుపై కేసులు: చంద్రబాబు
-
ఆ నగ్న ఊరేగింపు ఫొటోకు అవార్డు.. నెట్టింట ఆగ్రహం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది: కేటీఆర్
-
ఉపాధ్యాయ బదిలీల్లో రూ.వందల కోట్ల కుంభకోణం: నాదెండ్ల మనోహర్