జనగణన తొలి దశ నిరవధిక వాయిదా
ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి చేపట్టాల్సిన 2021 జనగణన తొలి దశను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు కేంద్ర రిజిస్ట్రార్ జనరల్, సెన్సస్ కమిషనర్ ప్రకటించారు. ఈ మేరకు బుధవారం ఆ కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదలైంది. కరోనా కారణంగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా...
ఈనాడు, దిల్లీ: ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి చేపట్టాల్సిన 2021 జనగణన తొలి దశను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు కేంద్ర రిజిస్ట్రార్ జనరల్, సెన్సస్ కమిషనర్ ప్రకటించారు. ఈ మేరకు బుధవారం ఆ కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదలైంది. కరోనా కారణంగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలుచేస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అందులో పేర్కొన్నారు. 2021 జనాభా లెక్కల సేకరణను రెండు దశల్లో చేపట్టాలని నిర్ణయించారు. అందులో భాగంగా తొలిదశ కింద ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30వరకు ఇళ్ల గుర్తింపు, ఇళ్ల లెక్కింపు చేయాల్సి ఉంది. అలాగే అసోం మినహా మిగిలిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ తొలిదశలోనే జాతీయ జనాభా పట్టిక (ఎన్పీఆర్)ను నవీకరించాల్సి ఉంది. తాజా నిర్ణయంతో ఈ రెండు కార్యక్రమాలు వాయిదా పడినట్లైంది. తొలిదశలో చేపట్టాల్సిన ఇళ్ల గుర్తింపు, లెక్కింపు, ఎన్పీఆర్ నవీకరణ కార్యక్రమాలను కోవిడ్-19 మహమ్మారి విస్తరణ, లాక్డౌన్లను దృష్టిలో ఉంచుకొని తదుపరి ఆదేశాలు జారీచేసేంతవరకూ నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు సెన్సస్ కమిషనర్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!