మూడో దశకు చేరకుండా ప్రత్యేక దృష్టి:హరీశ్
లాక్డౌన్ నేపథ్యంలో తెల్ల రేషన్కార్డు లబ్ధిదారులకు ప్రభుత్వం ప్రకటించిన బియ్యాన్ని రేపటి నుంచి పంపిణీ చేస్తామని మంత్రి హరీశ్రావు తెలిపారు. రేషన్ దుకాణాల వద్ద సామాజిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేపట్టామన్నారు. వారంరోజుల పాటు బియ్యం పంపిణీ...
హైదరాబాద్: లాక్డౌన్ నేపథ్యంలో తెల్ల రేషన్కార్డు లబ్ధిదారులకు ప్రభుత్వం ప్రకటించిన బియ్యాన్ని రేపటి నుంచి పంపిణీ చేస్తామని మంత్రి హరీశ్రావు తెలిపారు. రేషన్ దుకాణాల వద్ద సామాజిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేపట్టామన్నారు. వారంరోజుల పాటు బియ్యం పంపిణీ కొనసాగిస్తామని హరీశ్ స్పష్టం చేశారు.ఈ-కుబేర్ ద్వారా ప్రతి రేషన్కార్డు లబ్ధిదారుని ఖాతాలో రూ.1500 నేరుగా జమ చేస్తామని.. ఏప్రిల్ 1 నుంచి నగదు జమ ప్రక్రియ ప్రారంభమవుతుందని మంత్రి తెలిపారు. రైతుల నుంచి జంట నగరాలకు కూరగాయలు సరఫరా చేసేందుకు పాసులు అందజేస్తామన్నారు. నిత్యావసర వస్తువులు జంట నగరాలకు చేరేలా పోలీసులు ప్రత్యేక పర్యవేక్షణ ఉంటుందని ఆయన చెప్పారు.
హైదరాబాద్కు నిత్యావసరాలు, కూరగాయలు తీసుకెళ్లే వాహనాలకు బోర్డులు ఏర్పాటు చేయాలని హరీశ్రావు సూచించారు. బోర్డులు ఉన్న వాహనాలను ఇబ్బంది లేకుండా అనుతిస్తారని చెప్పారు. ప్రజలు బయటకు వచ్చినపుడు వారానికి సరిపడా సరకులు తీసుకెళ్లాలని సూచించారు. కరోనా నివారణకు ఇళ్లలో ఉండటమే ఏకైక మార్గమన్నారు. కరోనా ప్రభావంతో మార్చిలో రూ.2,500 కోట్ల ఆదాయం తగ్గుతుందని అంచనా వేస్తున్నామని చెప్పారు. ఆదాయం తగ్గినా ప్రజలకు నిత్యావసర వస్తులు, నగదు బదిలీ చేస్తామన్నారు. కరోనా మూడో దశకు చేరుకోకుండా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్