ఏపీ మంత్రివర్గ సమావేశం ప్రారంభం

ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం 2020-21 బడ్జెట్‌ ఆర్డినెన్స్‌ను ఆమోదించనుంది. లాక్‌డౌన్‌ పరిస్థితులు, కరోనా నిరోధ

Published : 27 Mar 2020 11:40 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం 2020-21 బడ్జెట్‌ ఆర్డినెన్స్‌ను ఆమోదించనుంది. లాక్‌డౌన్‌ పరిస్థితులు, కరోనా నిరోధ చర్యలపై మంత్రివర్గం చర్చించనుంది. వచ్చే మూడునెలల కాలానికి అవసరమైన ఖర్చుల నిమిత్తం ఆర్డినెన్స్‌ తీసుకురానున్నట్టు సమాచారం.
గత రెండ్రోజులుగా హైదరాబాద్‌ నుంచి రాష్ట్రంలోకి వస్తున్న వారిని సరిహద్దుల వద్ద అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. దీనిపై కూడా మంత్రివర్గంలో చర్చ జరిగే అవకాశముంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని