లాక్‌డౌన్‌పై సమీక్ష.. కాసేపట్లో కేసీఆర్‌ ప్రెస్‌మీట్‌

కరోనా వైరస్‌ ప్రభావం నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ పరిస్థితులపై సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. ప్రగతిభవన్‌లో నిర్వహించిన సమీక్షకు సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి

Updated : 27 Mar 2020 15:09 IST

హైదరాబాద్‌: కరోనా వైరస్‌ ప్రభావం నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ పరిస్థితులపై సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. ప్రగతిభవన్‌లో నిర్వహించిన సమీక్షకు సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. కరోనా కట్టడికి తీసుకున్న చర్యలపై అధికారులను సీఎం అడిగి తెలుసుకున్నారు. లాక్‌డౌన్ కొనసాగుతున్న క్రమంలో ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయాలను సీఎం వెల్లడించనున్నారు. దీనిపై కాసేపట్లో కేసీఆర్‌ మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా కరోనా వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయడమే లక్ష్యంగా ఆయన మరిన్ని కీలక నిర్ణయాలు వెలువరించే అవకాశం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని