విద్యుత్ బిల్లుల చెల్లింపునకు వెసులుబాటు!
కరోనా మహమ్మారి దేశ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసింది. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించడంతో దేశవ్యాప్తంగా అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో ఉపాధి
హైదరాబాద్: కరోనా మహమ్మారి దేశ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసింది. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించడంతో దేశవ్యాప్తంగా అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో ఉపాధి అవకాశాలపై తీవ్ర ప్రభావం పడింది.
ఈ నేపథ్యంలో విద్యుత్ మంత్రిత్వశాఖ సాధారణ ప్రజలకు సహాయ ప్యాకేజీని ప్రకటించే యోచనలో ఉంది. వచ్చే మూడు నెలలు విద్యుత్ బిల్లులు చెల్లించడంలో ఆలస్యమైనా జరిమానా మినహాయించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. అన్ని రాష్ట్రాల రెగ్యులేటరీలకు కేంద్ర విద్యుత్ రెగ్యులేటరీ సంస్థ ఇవాళ స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. దీనిపై గత రెండ్రోజులుగా విద్యుత్ శాఖ అధికారులతో కేంద్ర ఇంధనశాఖ మంత్రి ఆర్.కె.సింగ్ సంప్రదింపులు జరిపినట్లు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా