ప్రధాని కేర్స్ నిధికి ఏపీ గవర్నర్ విరాళం
దేశంలో కరోనాపై పోరాటానికి ఏర్పాటు చేసిన ప్రధాని కేర్స్ నిధికి ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ విరాళాన్ని ప్రకటించారు. తన నెల జీతాన్ని విరాళంగా ఇస్తున్నట్లు వెల్లడించారు. మరోవైపు సీఎం సహాయ నిధికి రూ.లక్ష విరాళంగా...
అమరావతి: దేశంలో కరోనాపై పోరాటానికి ఏర్పాటు చేసిన ప్రధాని కేర్స్ నిధికి ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ విరాళాన్ని ప్రకటించారు. తన నెల జీతాన్ని విరాళంగా ఇస్తున్నట్లు వెల్లడించారు. మరోవైపు సీఎం సహాయ నిధికి రూ.లక్ష విరాళంగా ప్రకటించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. ప్రజలు ఉదారంగా విరాళాలు అందించి కరోనా కట్టడిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. వైరస్ వ్యాప్తి నిరోధానికి ప్రజలు మరింతగా సహకరించాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాలు కచ్చితంగా పాటించాలన్నారు.సామాజిక దూరం పాటిస్తూ, స్వీయ నిర్భందంలో క్రమశిక్షణతో మెలగాలని సూచించారు. ‘‘ ఈ మహమ్మారి అన్ని దేశాలకూ వ్యాపిస్తోందని డబ్ల్యూహెచ్వో ప్రకటించింది.21 రోజుల పాటు లాక్డౌన్ను అందరూ పాటించాలి. కరోనా లక్షణాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. ఈ విషయంలో విదేశీ ప్రయాణికులు స్వచ్ఛందంగా ముందుకు రావాలి. వృద్ధులు, పిల్లలు తగిన జాగ్రత్తలు పాటించాలి. కూలీలు, వలస కార్మికులకు సామగ్రిని రెడ్క్రాస్ ద్వారా ఉచితంగా పంపిణీ చేయాలి’’ అని గవర్నర్ అన్నారు. అంతకుముందు ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డి గవర్నర్ను కలిశారు. రాష్ట్రంలో కారోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో తీసుకుంటున్న చర్యలను ఆయనకు వివరించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా రాష్ట్రంలో తాజా పరిస్థితిని గవర్నర్కు తెలియజేసినట్లు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
శిరోముండనం కేసు.. హైకోర్టులో విచారణ వాయిదా
శిరోముండనం కేసులో విశాఖపట్నం కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. -
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీ పిటిషన్పై తీర్పు వాయిదా
సీఎం జగన్పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ కస్టడీ పిటిషన్పై తీర్పును విజయవాడ కోర్టు వాయిదా వేసింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి
ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయంలో చిన్న హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
పాటలతో రీల్స్.. మాటలతో మీమ్స్
లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే నామపత్రాల ప్రక్రియ జోరందుకొంది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు క్షేత్రస్థాయిలో తిరుగుతూ ప్రచారం చేస్తూనే సామాజిక మాధ్యమాల్లోనూ చురుగ్గా ఉంటున్నారు. -
భగభగ మండే
విపరీతమైన ఎండలకు మిర్యాలగూడ ప్రాంతం మాడిపోతోంది. సోమవారం మండల పరిధిలోని టీక్యాతండాలో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రత 45 డిగ్రీలు నమోదైంది. -
పట్టాలెక్కని ప్రతిపాదనలు
ఉమ్మడి జిల్లాలో రైల్వే శాఖాపరంగా అభివృద్ధికి అడుగులు పడాలని ప్రయాణికులు ఆశిస్తున్నారు. -
ప్రతి ఓటును ఒడిసిపట్టేలా..
సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని భారాస.. పాతికేళ్ల తర్వాత అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని కాంగ్రెస్... ఈసారి సత్తా చాటాలని భాజపా.. పక్కా వ్యూహంతో ముందుకు కదులుతున్నాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (23/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
రివ్యూ: ఆర్టికల్ 370.. యామి గౌతమ్, ప్రియమణి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
మద్యం మత్తులో విమాన సిబ్బందిపై ప్రయాణికుడి దాడి
-
వరుసగా మూడో రోజూ లాభాల్లో ముగిసిన సూచీలు
-
‘చొరబాటుదారు’ వ్యాఖ్యలు.. మోదీపై ఫిర్యాదును పరిశీలిస్తున్నామన్న ఈసీ..!