దాల్మియా భారత్ గ్రూప్ రూ.25 కోట్ల సాయం
దాల్మియా భారత్ గ్రూప్ సంస్థ తన దాతృత్వాన్ని చాటుకుంది. కరోనా వైరస్పై పోరాటానికి పీఎం కేర్స్కు రూ.25 కోట్లు విరాళం ఇచ్చినట్లు ప్రకటించింది. ‘‘కరోనాను ఎదుర్కోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గొప్పగా పనిచేస్తున్నాయి. మా బాధ్యతగా పీంకేర్స్కు
దిల్లీ: దాల్మియా భారత్ గ్రూప్ సంస్థ తన దాతృత్వాన్ని చాటుకుంది. కరోనా వైరస్పై పోరాటానికి పీఎం కేర్స్కు రూ.25 కోట్లు విరాళం ఇచ్చినట్లు ప్రకటించింది. ‘‘కరోనాను ఎదుర్కోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గొప్పగా పని చేస్తున్నాయి. మా బాధ్యతగా పీంకేర్స్కు రూ.25 కోట్లు ఇచ్చాం. కరోనా వైరస్పై ప్రధాని, రాష్ట్ర ముఖ్యమంత్రులు చేస్తున్న పోరాటంలో మేం సాయం చేసేందుకు మనస్ఫూర్తిగా సిద్ధంగా ఉంటాం’’ అని దాల్మియా భారత్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ పునీత్ దాల్మియా అన్నారు.
అంతేకాక కొవిడ్ 19ను అరికట్టేందుకు స్థానిక అధికారులను తమ ప్లాంట్స్లోని మైదానాలు, అతిథి గృహాలు, టెక్నికల్ కేంద్రాలను ఉపయోగించుకోవాలన్నారు. సొంత ప్రాంతాలకు వెళ్లలేక ఇబ్బంది పడుతున్న ఒప్పంద కార్మికులకు ఆశ్రయంతో పాటు రేషన్, కిరాణ సరకులు అందిస్తున్నామని తెలిపారు. దేశ వ్యాప్తంగా ఉన్న తమ ఫ్యాక్టరీ క్యాంటీన్లలోని ఆహారాన్ని తయారు చేసి స్థానిక మున్సిపాలిటీలు, పోలీసులు, ఆశ్రయం లేని వారికి పంపిణీ చేస్తున్నారు. ప్రతిరోజు 100 ప్యాకెట్లకు పైగా ఆహారాన్ని రెండు సార్లు అందిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు