ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ సమీక్ష

కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్‌ కొనసాగుతున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రగతిభవన్‌లో నిర్వహించిన ఈ సమీక్షకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి...

Published : 01 Apr 2020 16:47 IST

హైదరాబాద్‌: కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్‌ కొనసాగుతున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రగతిభవన్‌లో నిర్వహించిన ఈ సమీక్షకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు తదితరులు హాజరయ్యారు. కరోనా కేసుల  ప్రభావం, లాక్‌డౌన్‌ అమలుతో పాటు ఇతర అంశాలపైనా సీఎం సమీక్షించారు. తదుపరి చేపట్టాల్సిన మరిన్ని చర్యలపై కేసీఆర్ వారితో చర్చించారు.

మరోవైపు జీహెచ్‌ఎంసీ ప్రజాప్రతినిధులతో రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. మాసబ్‌ట్యాంక్‌లోని పశుసంవర్ధకశాక కార్యాలయం నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లతో నిర్వహించిన ఈ టెలికాన్ఫరెన్స్‌లో కరోనా నివారణ చర్యలు, లాక్‌డౌన్‌ అమలు తీరు, ప్రభుత్వ కార్యక్రమాలపై సమీక్షించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని