హాట్ స్పాట్లలో రాపిడ్ యాంటీబాడీ టెస్టులు
దేశవ్యాప్తంగా కరోనా కేసులకు 10 ప్రాంతాలు హాట్స్పాట్లుగా ఉన్నాయని కేంద్రం ప్రకటించింది. ఎక్కువ కేసులు ఆరు రాష్ట్రాల్లోని ఆ ప్రాంతాల్లోనే ఉన్నాయని తేల్చింది. హజ్రత్ నిజాముద్దీన్లో జరిగిన మతపరమైన
దిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా కేసులకు 10 ప్రాంతాలు హాట్స్పాట్లుగా ఉన్నాయని కేంద్రం ప్రకటించింది. ఎక్కువ కేసులు ఆరు రాష్ట్రాల్లోని ఆ ప్రాంతాల్లోనే ఉన్నాయని తేల్చింది. హజ్రత్ నిజాముద్దీన్లో జరిగిన మతపరమైన సమ్మేళనానికి హాజరైన తబ్లీగీ జమాత్ ప్రతినిధుల వల్లనే వైరస్ వ్యాప్తి అమాంతం పెరిగినట్లు తేలడంతో వారి ఆచూకీ కోసం గాలింపు ముమ్మరమయింది. ఇప్పటివరకు 6,000 మందిని గుర్తించి, సుమారు 5,000 మందిని క్వారంటైన్కు తరలించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, తమిళనాడు సహా వేర్వేరు రాష్ట్రాల్లో ఉన్న వారి కోసం గాలిస్తున్నారు. ఇవాళ ఉదయం వరకు దేశంలో కేసుల సంఖ్య 1965కు చేరిందని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది.
కొవిడ్-19 హాట్ స్పాట్ లలో రాపిడ్ యాంటీ బాడీ టెస్ట్ లు నిర్వహించాలని వైద్య పరిశోధన మండలి ఆదేశించింది. హాట్ స్పాట్ లుగా పరిగణించిన ప్రాంతాల్లో జనాభా ఎక్కువ ఉన్న చోట ఈ పరీక్షలు నిర్వహించాలని సూచించింది. గొంతు, ముక్కు రంధ్రాల వద్ద ఈ పరీక్షలు నిర్వహిస్తారని, ఈ పరీక్షలో పాజిటివ్ వస్తేనే చికిత్సకు పంపాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
నెగిటివ్ వచ్చిన వారు గృహానికి పరిమితం కావాలని వైద్య పరిశోధన మండలి మధ్యంతర సూచనలు జారీ చేసింది. ఐసీఎంఆర్ ఇవాళ సాయంత్రం 5గంటలకు జాతీయ టాస్క్ ఫోర్స్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో కొవిడ్ -19 విషయంలో ఇతర సూచనలను టాస్క్ఫోర్స్ ఆమోదించనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెలంగాణ జెన్కో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ పరీక్ష వాయిదా
జెన్కోలో అసిస్టెంట్ ఇంజినీర్(ఏఈ), కెమిస్ట్ ఉద్యోగాల నియామక రాత పరీక్ష వాయిదా పడింది. -
ఎంపీ అవినాష్ ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్పై హైకోర్టులో విచారణ
ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఆ హంతకులకు, జగన్కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
హంతకులకు ఓటు వేయవద్దని మాజీ మంత్రి వివేకా కుమార్తె సునీత మరోమారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్రెడ్డి
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు విచారణ గురువారం సీబీఐ కోర్టులో జరిగింది. -
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట
స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెదేపా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు(Atchannaidu)కి ఊరట లభించింది. -
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం
ఎన్నికల దృష్ట్యా ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను కేంద్ర ఎన్నికల సంఘం (Elections Commission) నియమించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
తిరుమల నడక మార్గంలో చిరుత సంచారం
అలిపిరి కాలిబాటలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26 తేదీల్లో ఇక్కడి నడక మార్గంలో చిరుత కదలికలు కనిపించాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణ జెన్కో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ పరీక్ష వాయిదా
-
మస్క్ కీలక ప్రకటన.. వారికి ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఫ్రీ!
-
ఎంపీ అవినాష్ ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్పై హైకోర్టులో విచారణ
-
పార్ట్టైమ్ ఉద్యోగాల స్కామ్.. రూ.32.34 కోట్లు అటాచ్
-
కాంగ్రెస్ vs కాంగ్రెస్.. హస్తం కంచుకోటకు అసమ్మతి బీటలు
-
భారత సరిహద్దులు పూర్తి సురక్షితం - రాజ్నాథ్ సింగ్