వారి వల్లే ఎక్కువ కరోనా కేసులు: గవర్నర్
దేశ వ్యాప్తంగా లాక్డౌన్ అమలు, ప్రభుత్వ చర్యలపై గవర్నర్లతో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాజ్భవన్ నుంచి రాష్ట్ర గవర్నర్
అమరావతి: దేశ వ్యాప్తంగా లాక్డౌన్ అమలు, ప్రభుత్వ చర్యలపై గవర్నర్లతో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాజ్భవన్ నుంచి రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, కార్యదర్శి ముఖేష్కుమార్ మీనా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గత మూడు రోజుల నుంచి అనూహ్యంగా పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసుల అంశాన్ని ప్రస్తావించిన గవర్నర్... అనుమానితులందరికీ వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన సేవలందిస్తున్నారని వివరించారు. విదేశాల నుంచి రాష్ట్రానికి 30,693 మంది వచ్చినప్పటికీ వారందరికీ వైద్య పరీక్షలు నిర్వహించి స్వీయ నిర్బంధంలో ఉండాలని ఆదేశించి, అమలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం అధికంగా నమోదవుతున్న కేసుల్లో ఎక్కువ భాగం దిల్లీలో జరిగిన సమ్మేళనానికి వెళ్లి వచ్చిన వారివేనని, వారితో పాటు కలిసి తిరిగిన వారిపైనా దృష్టి సారించి వైరస్ వ్యాప్తి నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పూర్తిగా వ్యవసాయ ఆధారిత ప్రాంతమని, ఉద్యాన పంటలు, ఇతర వ్యవసాయ పంటలు పండిస్తోన్న రైతులు, ఆక్వా సాగుదారులకు ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని గవర్నర్ను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వినాసికారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
మహిళకు శస్త్రచికిత్స చేసి.. తల్లీ బిడ్డను కాపాడిన దర్శి అభ్యర్థి
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
-
నడుం నొప్పి, కుంగుబాటు, తలనొప్పి.. అనారోగ్యానికి ప్రధాన కారణాలివే
-
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి