కానిస్టేబుల్ను అభినందించిన సీపీ..ఎందుకో తెలుసా?
చిరుద్యోగికి ఉన్నతాధికారి ప్రశంస కొండంత బలాన్నిస్తుందనడానికి ఉదాహరణగా నిలుస్తుందీ ఘటన. పోలీసు ఉద్యోగం అంటేనే నిత్యం సవాళ్లతో కూడుకున్నది. శాంతిభద్రతలలు పరిరక్షించడంలో నిత్యం
హైదరాబాద్: చిరుద్యోగికి ఉన్నతాధికారి ప్రశంస కొండంత బలాన్నిస్తుందనడానికి ఉదాహరణగా నిలుస్తుందీ ఘటన. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఓ కానిస్టేబుల్ కుటుంబం గురించి తెలుసుకున్న సీపీ అంజనీ కుమార్ అతన్ని అభినందించారు. విపత్కర పరిస్థితుల్లో తీపి కబురు చెప్పిన ఆ కానిస్టేబుల్ను ప్రశంసించారు.
ఏం జరిగిందంటే?
శుక్రవారం రాత్రి సీపీ అంజనీకుమార్ తన విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో చెక్ పోస్టుల వద్ద, కూడళ్లలో డ్యూటీ చేస్తున్న కానిస్టేబుళ్లు, అధికారులతో ముచ్చటించారు. వారి బాగోగులు, కుటుంబ నేపథ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. లిబర్టీ వద్ద విధులు నిర్వహిస్తున్న నారాయణగూడ పోలీస్స్టేషన్ కానిస్టేబుల్ సాయికిషన్ తనకు రెండ్రోజుల క్రితం బాబు పుట్టాడని చెప్పగా.. సీపీ ఆశ్చర్యపోయారు. ఇలాంటి సమయంలో కూడా కుటుంబాన్ని వదిలి విధులకు హాజరైన అతన్ని మెచ్చుకున్నారు. మిఠాయిలు, బిస్కట్లు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. సీపీ వచ్చి స్వయంగా శుభాకాంక్షలు చెప్పడంతో కానిస్టేబుల్ సాయి కిషన్ ఆనందానికి అవధుల్లేవు. తమను ఇంతగా ప్రోత్సహిస్తున్న సీపీ అంజనీకుమార్కు కానిస్టేబుల్ కృతజ్ఞతలు తెలిపారు. ఆయన ఇచ్చిన ప్రోత్సాహంతో మరింత రెట్టింపు ఉత్సాహంతో పనిచేయడానికైనా సిద్ధమని సాయికిషన్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. -
వైకాపా ప్రచార రథం ఢీకొని బాలుడి మృతి విషాదకరం: చంద్రబాబు
వైకాపా ప్రచారరథం ఢీకొని బాలుడు మృతి చెందిన ఘటన అత్యంత విషాదకరమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
దిల్లీ మద్యం స్కామ్.. సీబీఐ కేసులోనూ అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి
దిల్లీ మద్యం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. గతంలో ఈడీ కేసులో అప్రూవర్గా మారిన నిందితుడు శరత్ చంద్రారెడ్డి, సీబీఐ నమోదు చేసిన కేసులోనూ అప్రూవర్గా మారారు. -
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. భారాస ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి సమావేశంలో పాల్గొన్నారని ఆరోపిస్తూ ఇటీవల వారిపై సస్పెన్షన్ వేటు వేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
చిలుకూరు ఆలయంలో గరుడ ప్రసాదం పంపిణీ నిలిపివేశాం: రంగరాజన్
హైదరాబాద్ శివారులోని చిలుకూరు బాలాజీ ఆలయంలో గరుడ ప్రసాదం పంపిణీ నిలిపివేసినట్టు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ తెలిపారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వి‘నాసి’కారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.