ఒకేసారి లైట్లు ఆపినా ఫర్వాలేదు: విద్యుత్ శాఖ
కరోనా మహమ్మారి అనే అంధకారాన్ని పారదోలి.. నిరంతరం ప్రకాశం వైపు సాగాలని ఆకాంక్షిస్తూ..ఏప్రిల్ 5, ఆదివారం రాత్రి 9గంటలకు 9 నిమిషాల...
దిల్లీ: కరోనా మహమ్మారి అనే అంధకారాన్ని పారదోలి.. నిరంతరం ప్రకాశం వైపు సాగాలని ఆకాంక్షిస్తూ..ఏప్రిల్ 5, ఆదివారం రాత్రి 9గంటలకు 9 నిమిషాల పాటు దేశవ్యాప్తంగా లైట్లు బంద్ చేసి టార్చ్, మొబైల్ లైట్లు, కొవ్వొత్తులు, దివ్వెలను వెలిగించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాల విద్యుత్ శాఖ ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులకు కేంద్ర విద్యుత్ శాఖ కార్యదర్శి సంజీవ్ నందన్ సాహ్లి లేఖ రాశారు. అందరూ ఒకే సారి లైట్లు ఆపివేయడం వల్ల గ్రిడ్పై ఒకేసారి ప్రభావం పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కేంద్రం కేవలం లైట్లు మాత్రమే ఆపమని చెప్పిందని, ఇంట్లోని ప్రిజ్, ఏసీ, టీవీ తదితర వస్తువులను ఉపయోగించుకోవచ్చని తెలిపారు. వీధి లైట్లు తప్పనిసరిగా ఉండాలని కేంద్రం ఆదేశించిన విషయాన్ని గుర్తు చేశారు. వీధి లైట్లు, శాంతి భద్రతల విషయంలో స్థానిక ప్రభుత్వాలు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఆస్పత్రులు సహా అన్ని అత్యవసర ప్రదేశాల్లో లైట్లు ఆపాల్సిన పని లేదని స్పష్టం చేశారు. ఒకేసారి లైట్లన్నీ ఆపేయడం వల్ల పవర్గ్రిడ్లు కుప్పకూలిపోతాయంటూ వస్తున్న పుకార్లపై కేంద్ర విద్యుత్ శాఖ వివరణ ఇచ్చింది. గ్రిడ్లకు ఎలాంటి నష్టం వాటిల్లబోదని స్పష్టం చేసింది.
ఆ వార్తలు అవాస్తవం: సీఎండీ ప్రభాకర్రావు
మరోవైపు ఆదివారం రాత్రి 9 గంటల నుంచి 9 నిమిషాలపాటు లైట్లు ఆపివేయడం వల్ల పవర్ గ్రిడ్పై ప్రభావం పడుతుందటూ వస్తున్న పుకార్లపై తెలంగాణ ట్రాన్స్కో, జెన్కో సీఎండీ ప్రభాకర్రావు వివరణ ఇచ్చారు. ఒకేసారి లైట్లు ఆపితే గ్రిడ్పై ఎలాంటి ప్రభావం ఉండబోదని స్పష్టం చేశారు. తగిన జాగ్రత్తలతో గ్రిడ్కు సమస్య రాకుండా అప్రమత్తంగా ఉన్నామని వెల్లడించారు. ఒకేసారి లైట్లు ఆపితే గ్రిడ్ కుప్పకూలుతుందన్న ప్రచారంలో వాస్తవం లేదని అన్నారు. ‘‘ తెలంగాణ పవర్ గ్రిడ్ సురక్షితంగా ఉంది. ఇప్పటికే తగిన జాగ్రత్తలు పాటించాలని ఆదేశాలు జారీ చేశాం. కరోనా కట్టడికి ప్రధాని మోదీ పిలుపును విజయవంతం చేయండి. ప్రజలు లాక్డౌన్లో పాల్గొని కరోనా వ్యాప్తిని అరికట్టండి’’ అని కోరారు. లాక్డౌన్ అమల్లో ఉన్నందువల్ల విద్యుత్ బిల్లులను ఆన్లైన్లో చెల్లించాలని సీఎండీ ప్రభాకర్రావు విజ్ఞప్తి చేశారు.
శానిటైజర్ పూసుకొని దీపాలు వెలిగించొద్దు
ప్రధాని మోదీ పిలుపు మేరకు లైట్లు ఆపివేసి.. దీపాలు వెలిగించే సమయంలో చేతులకు శానిటైజర్ పూసుకోవద్దని నిపుణులు చెబుతున్నారు. శానిటైజర్లో ఆల్కహాల్ ఉన్నందువల్ల దానికి మండే గుణం ఉంటుంది. దీంతో దీపాలు వెలిగించే సమయంలో చేతులు కాలిపోయే ప్రమాదం ఉంది. అందువల్ల ఎట్టిపరిస్థితుల్లోనూ శానిటైజర్ రాసుకున్న చేతులతో దీపాలు వెలిగించవద్దని నిపుణులు కోరుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్