కేరళ హైకోర్టును ఆశ్రయించిన జంతు ప్రేమికుడు
కరోనా కట్టడిలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలవుతోంది. ఈ నేపథ్యంలో మనుషులే కాదు పెంపుడు జంతువులకు...
కొచ్చి (కేరళ) : కరోనా కట్టడిలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలవుతోంది. ఈ నేపథ్యంలో మనుషులే కాదు పెంపుడు జంతువులకూ ఇబ్బందులు తప్పడం లేదు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన ఓ జంతు ప్రేమికుడు కేరళ హైకోర్టును ఆశ్రయించాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. కేరళకు చెందిన ఎన్.ప్రకాశ్ అనే వ్యక్తి మూడు పిల్లులను పెంచుకుంటున్నాడు. కాగా, తన పిల్లులకు పెట్టే ఆహారం అయిపోవడంతో.. ఆహారం దొరికే కొచ్చి పెట్స్ ఆసుపత్రికి వెళ్లేందుకు అనుమతి కోసం ఈ నెల 4న ఆన్లైన్లో వెహికల్ పాసుకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఈ దరఖాస్తును పోలీసులు తిరస్కరించారు. దీంతో ప్రకాశ్ కేరళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ‘ఈ పిల్లులు మియే పెర్షియన్ ఆహారాన్ని మాత్రమే తింటాయని.. తాను శాకాహారిని కావడంతో మాంసాహారాన్ని వండడంలేదని’ ప్రకాశ్ పిటిషన్లో తెలిపారు. యానిమల్ యాక్టు ప్రకారం జంతువులు ఆహారం, వసతి పొందే హక్కు ఉందని ఈ పిటిషన్లో పేర్కొన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
పాపాల పెద్దిరెడ్డికి దళితులంటే ఎందుకంత చులకన?
-
భయపెడుతున్న భువన్.. శివారు మున్సిపాలిటీల్లో ఆస్తిపన్ను నాలుగైదు రెట్లు పెంపు
-
నకిలీ కరెన్సీ నోట్లతో దొరికిన వైకాపా నేత బంధువు
-
రేటింగుల పేరుతో మోసం కేసులో రూ.32 కోట్ల జప్తు
-
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
-
కన్నారా.. ఇది విన్నారా?