డ్రోన్ కెమెరాలతో నిఘా
తెలంగాణ పోలీసులకు సెయెంట్ కంపెనీ సహకారంతో ప్రత్యేక డ్రోన్ కెమెరాలు అందాయని.. వాటిని లాక్డౌన్ సమయంలో నిఘా కోసం ఉపయోగిస్తున్నట్లు రాచకొండ
హైదరాబాద్ : తెలంగాణ పోలీసులకు సెయెంట్ కంపెనీ సహకారంతో ప్రత్యేక డ్రోన్ కెమెరాలు అందాయని.. వాటిని లాక్డౌన్ సమయంలో నిఘా కోసం ఉపయోగిస్తున్నట్లు రాచకొండ సీపీ మహేష్భగవత్ తెలిపారు. నేరేడ్మెట్లోని కమిషనరేట్లో సోమవారం హర్ష టయోటా కంపెనీ వారు పోలీసు వాహనాలకు చేపట్టిన ఉచిత శానిటైజేషన్ కార్యక్రమాన్ని సీపీ ప్రారంభించారు. 100 పెట్రో మొబైల్ వాహనాలు, 50 ఎస్కార్ట్ వాహనాలు, 50 అధికారుల వాహనాలకు శానిటైజేషన్ చేపట్టామన్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో మర్కజ్కు వెళ్లి వచ్చిన 98 మందిని గుర్తించామని రాచకొండ సీపీ మహేష్భగవత్ తెలిపారు. వారిలో కరోనా ఉన్నవారిని ఇప్పటికే ఆసుపత్రికి తరలించామన్నారు.
* జవహర్నగర్ నగరపాలకసంస్థ పరిధిలో సుమారు 1500 మంది పేదలకు పోలీసుల ఆధ్వర్యంలో పది రోజులుగా భోజనం అందించడం అభినందనీయమని సీపీ అన్నారు. సోమవారం రాత్రి ఆయన స్వయంగా పాల్గొని పేదలకు భోజనం అందజేశారు
వినూత్నంగా ప్రచారం
మల్కాజిగిరి: మల్కాజిగిరి సర్కిల్ పరిధిలో ముగ్గురు కరోనా రోగులు నివసించే కాలనీల్లోని 1500 ఇళ్లలో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది సోమవారం సర్వే చేశారు. రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలోని ఐటీ సెల్ విభాగం ఆధ్వర్యంలో డ్రోన్కు స్పీకర్ అమర్చి పోలీసులు ప్రచారం చేశారు. వైరస్ సోకినవారిని కలిసినవారు తమకు సమాచారం తెలియజేయాలని పోలీసులు కోరారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారుంటే వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అనంతరం మల్కాజిగిరి ఏసీపీ నర్సింహారెడ్డి, సీఐ మన్మోహన్, డీఐ జగదీశ్వర్లు కాలనీవాసులతో సమావేశమై పలు జాగ్రత్తలు సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి
ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయంలో చిన్న హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
పాటలతో రీల్స్.. మాటలతో మీమ్స్
లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే నామపత్రాల ప్రక్రియ జోరందుకొంది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు క్షేత్రస్థాయిలో తిరుగుతూ ప్రచారం చేస్తూనే సామాజిక మాధ్యమాల్లోనూ చురుగ్గా ఉంటున్నారు. -
భగభగ మండే
విపరీతమైన ఎండలకు మిర్యాలగూడ ప్రాంతం మాడిపోతోంది. సోమవారం మండల పరిధిలోని టీక్యాతండాలో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రత 45 డిగ్రీలు నమోదైంది. -
పట్టాలెక్కని ప్రతిపాదనలు
ఉమ్మడి జిల్లాలో రైల్వే శాఖాపరంగా అభివృద్ధికి అడుగులు పడాలని ప్రయాణికులు ఆశిస్తున్నారు. -
ప్రతి ఓటును ఒడిసిపట్టేలా..
సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని భారాస.. పాతికేళ్ల తర్వాత అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని కాంగ్రెస్... ఈసారి సత్తా చాటాలని భాజపా.. పక్కా వ్యూహంతో ముందుకు కదులుతున్నాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (23/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా
-
ఇన్స్టంట్ ఇ-పాన్ కావాలా..? ఉచితంగా పొందండిలా..
-
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!
-
ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాను.. అల్లు అర్జున్పై ‘కేజీఎఫ్’ నటుడు ప్రశంసలు..
-
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
-
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి