23 రోజుల పసికందుకు కరోనా పాజిటివ్‌

మహబూబ్‌నగర్‌లో మరో మూడు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. తాజాగా నమోదైన ఈ కేసుల్లో 23 రోజుల పసికందుకు సైతం కరోనా వైరస్‌ సోకినట్లు జిల్లా కలెక్టర్‌ వెంకట్‌రావు తెలిపారు.

Updated : 07 Apr 2020 18:43 IST

మహబూబ్‌నగర్‌ (క్రైం): మహబూబ్‌నగర్‌లో మరో మూడు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. తాజాగా నమోదైన ఈ కేసుల్లో 23 రోజుల పసికందుకు సైతం కరోనా వైరస్‌ సోకినట్లు జిల్లా కలెక్టర్‌ వెంకట్‌రావు తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. రెండు రోజుల క్ర్రితం పసికందు తండ్రితో పాటు నాయనమ్మకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. తాజాగా ఆ కుటుంబంలో చిన్నారికి వైరస్‌ సోకింది. మెరుగైన చికిత్స కోసం పసికందును సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. 

దిల్లీ మర్కజ్‌కు వెళ్లొచ్చిన వారి నుంచే తాజాగా ఈ ముగ్గురికి వైరస్‌ సోకినట్లు తెలిసింది. మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఇప్పటి వరకు ఏడు కేసులు నమోదు కాగా ఒకరు డిశ్చార్జ్‌ అయ్యారు. ప్రస్తుతం ఆరుగురు చికిత్స పొందుతున్నారు. మరోవైపు తాజాగా ముగ్గురికి కరోనా సోకడంతో వారి ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్స్‌లో ఉన్నవారిని గుర్తించేందుకు వైద్య ఆరోగ్య సిబ్బంది చర్యలు చేపట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని