అత్యవసరమనీ.. నిత్యావసరాలనీ..
ఓ వైపు లాక్డౌన్ అమలులో ఉన్నా.. రాష్ట్రంలో 50 శాతం కరోనా కేసులు హైదరాబాద్లోనే నమోదవుతున్నా.. నగరంలో వాహనదారుల తీరులో మాత్రం మార్పు రావడం లేదు.నిబంధనలను ఉల్లఘించి రహదారులపై రాకపోకలు సాగిస్తూనే ఉన్నారు. ట్రాఫిక్ పోలీసులు వీరికి జరిమానాలు విధించి వాహనాలనూ..
కుంటి సాకులతో రోడ్లపైకి వస్తోన్న వాహనదారులు
మహానగరంలో పెరుగుతోన్న వాహనాల సంఖ్య
హైదరాబాద్: ఓ వైపు లాక్డౌన్ అమలులో ఉన్నా.. రాష్ట్రంలో 50 శాతం కరోనా కేసులు హైదరాబాద్లోనే నమోదవుతున్నా.. నగరంలో వాహనదారుల తీరులో మాత్రం మార్పు రావడం లేదు. నిబంధనలను ఉల్లఘించి రహదారులపై రాకపోకలు సాగిస్తూనే ఉన్నారు. ట్రాఫిక్ పోలీసులు వీరికి జరిమానాలు విధించి వాహనాలనూ స్వాధీనం చేసుకున్నా.. కుంటి సాకులు చెబుతూ ప్రయాణాలు సాగిస్తూనే ఉన్నారు. దీంతో రహదారులపై కొంత వరకు రద్దీ పెరగడంతో కొన్ని కూడళ్ల వద్ద ట్రాఫిక్ సిగ్రల్స్ను ఏర్పాటు చేశారు.
నిబంధనల సడలింపు.. నిరుపయోగం
లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రభుత్వం అత్యవసర, నిత్యావసరాల కోసం కొంత వరకు నిబంధనలను సడలింపు చేయడంతో వాటిని వివిధ రకాలుగా నిరుపయోగం చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకూ లాక్డౌన్ అమలులో ఉంటుంది. ఈ సమయంలో అత్యవసర పనులుంటే వారి నివాస స్థలం నుంచి మూడు కిలోమీటర్ల పరిధిలో ప్రయాణం చేయవచ్చు. ప్రత్యేక పరిస్థితులుంటే పోలీసులు అనుమతి పత్రాలు మంజూరు చేస్తున్నారు. కానీ వాహనదారులు ఈ నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. గత నాలుగైదు రోజుల నుంచి రహదారులపై వాహనాల సంఖ్య పెరుగుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. 6వ తేదీన ఒక్క రోజే దాదాపు 15 వేల వాహనాలపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. వాటిలో 13 వేలకుపైగా ద్విచక్రవాహనాలే ఉండడం గమనార్హం. కరోనాపై ప్రభుత్వం చేస్తున్న పోరులో ప్రజలు సహకరించి ఈ మహమ్మారి నివారణకు చేయూత అందించాలని పోలీసులు కోరుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైకోర్టుల్లోనూ మౌలిక సౌకర్యాల కొరత: సీజేఐ జస్టిస్ చంద్రచూడ్
ప్రజలకు న్యాయ సేవలు మరింత చేరువయ్యేలా మార్పులు రావాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆకాంక్షించారు. -
ఏపీలో పింఛన్ల పంపిణీ.. వాలంటీర్లకు కీలక ఆదేశాలు
ఏప్రిల్, మే నెల పింఛన్ల పంపిణీకి వాలంటీర్లు ఆథరైజేషన్ పత్రాలు తీసుకోవాలని గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ (సెర్ప్) సర్క్యులర్ జారీ చేసింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ప్రజలు ఉదాసీనంగా ఉన్నంత కాలం నిబంధనలు అమలు కావు: జస్టిస్ చలమేశ్వర్
ప్రజలు ఉదాసీనంగా ఉన్నంత కాలం ఎన్ని నిబంధనలు ఉన్నా అమలు కావని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ అన్నారు. -
ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
నేడు నగరంలోని ఉప్పల్ స్టేడియంలో ముంబయి-హైదరాబాద్ జట్ల మధ్య ఐపీఎల్ మ్యాచ్ జరగనుంది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రామ్చరణ్ దంపతులు
తిరుమల శ్రీవారిని సినీనటుడు రామ్చరణ్, ఉపాసన దంపతులు దర్శించుకున్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మావయ్యా.. ఇదేం ప్రగతయ్యా..?
నాడు-నేడు అంటూ విద్యా వ్యవస్థలో, మౌలిక సదుపాయాల కల్పనలో ఎన్నో సమూల మార్పులు తెచ్చామని రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నా.. నేటికీ పలు చోట్ల ఆ ప్రగతి కనిపించడం లేదు. -
డబ్బులు ఇస్తారా.. స్టేషన్కు వస్తారా..!
కొంతమంది పోలీసులు అధికారుల ఆదేశాలను అడ్డుగా పెట్టుకుని వసూళ్లకు పాల్పడుతున్నారు. తాము నిబంధనలు ఉల్లంఘించలేదని తమను వదిలిపెట్టాలని బాధితులు వేడుకుంటున్నా వారు వినిపించుకోకుండా తమదైన ముద్ర చూపుతున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.. -
ప్రయాణికుల రద్దీ.. 32 ప్రత్యేక రైళ్ల సర్వీసులు పొడిగింపు
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని పలు ప్రత్యేక రైళ్ల సర్వీసులను పొడిగిస్తూ దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది. ఆ రైళ్ల వివరాలివే..
తాజా వార్తలు (Latest News)
-
జాన్వీతో రామ్ చరణ్ సినిమా.. ఏడేళ్ల క్రితమే కోరిక బయటపెట్టిన చిరంజీవి
-
దిల్లీలో రాష్ట్రపతి పాలన విధిస్తే.. అది ‘రాజకీయ ప్రతీకారమే’ - ఆప్
-
మథుర కాకపోతే పోటీ చేసేదాన్ని కాదు : హేమమాలిని
-
ఆరు నెలల్లో.. రూ.7.5 లక్షల కోట్ల రుణానికి కేంద్రం సిద్ధం
-
లీడర్ పిలిస్తే.. జనసేన పార్టీ ప్రచారానికి సిద్ధంగా ఉన్నా: నటి అనసూయ
-
రిలయన్స్ జోరు.. మరోసారి ₹20 లక్షల కోట్లకు..