జనాలకు వైరస్‌..ఆ పాండాలకు జోష్‌

కరోనా దెబ్బకు పలు దేశాల్లో లాక్‌డౌన్‌ విధించారు. దీంతో ప్రజలు ఇళ్లకు పరిమితమయ్యారు. సందర్శుకులతో ఉండే పలు ప్రదేశాలు నిర్మానుష్యంగా

Published : 08 Apr 2020 01:25 IST

హాంగ్‌కాంగ్‌: కరోనా దెబ్బకు పలు దేశాల్లో లాక్‌డౌన్‌ విధించారు. దీంతో ప్రజలు ఇళ్లకు పరిమితమయ్యారు. సందర్శకులతో ఉండే పలు ప్రదేశాలు నిర్మానుష్యంగా మారాయి. దీంతో హాంకాంగ్‌లోని ఒక  ‘పాండా’ పార్కులోని పాండాల జంట  సందర్శకులు లేకపోవటంతో సరససల్లాపాలు మొదలుపెట్టాయి. ఇంగ్‌ఇంగ్ అనే ఆడ పాండా, లీలీ అనే మగ పాండా దాదాపు పదేళ్ల తర్వాత ఏకాంతంగా గడిపాయి. 2010లో ఒక్కసారి కలిసిన ఈ జంట మళ్లీ ఇపుడే ఒక్కటయ్యాయని పార్క్‌ సంరక్షకులు అంటున్నారు. ఇందుకు సంబంధించి ఫొటోలను సామాజిక మాధ్యమాలలో ఉంచగా అనూహ్య స్పందన లభిస్తోంది. సాధారణంగా పాండాలు పునురుత్పత్తిలో అంతగా ఆసక్తి చూపించవని, అందునా బంధీఖానాలో ఉన్నప్పుడు అస్సలు ఆ వ్యాపకమే ఉండదని వారు అంటున్నారు. ఇన్నాళ్లు ఆడ పాండా ఇంగ్‌ఇంగ్ నీళ్లతో ఆడుకుంటూ మడుగు దగ్గర గడపగా, లీలీ ఆ మడుగు చుట్టూ తిరుగుతూ ఇంగ్‌ఇంగ్‌ను ఆకర్షించడానికి ప్రయత్నించేదని సంరక్షకులు చెబుతున్నారు. ప్రస్తుతం పాండాలు వాటి తోకల ద్వారా ఒకదానికొకటి ప్రేమ సంకేతాలు పంపుకుంటున్నాయన్నారు. జంతునిపుణులు ఇంగ్‌ఇంగ్‌ గర్భధారణ సంకేతాలను గమనిస్తున్నారని, పాండాల గర్భధారణ సమయం 72 రోజుల నుంచి 324 రోజలు ఉంటుందని వారు అంటున్నారు. ప్రస్తుతం ఇంగ్‌ఇంగ్‌లో గర్భధారణ సంకేతాలు కనిపిస్తున్నాయని, త్వరలోనే పిల్లపాండా రానుందని పార్క్‌ సంరక్షకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని