భక్తులు లేకుండానే కొండగట్టు హనుమాన్‌ జయంతి

జగిత్యాల జిల్లాలో ప్రసిద్ద పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయంలో భక్తులు లేకుండానే హనుమాన్‌ జయంతి వేడుకలను ఆలయ సిబ్బంది నిరాడంబరంగా...

Published : 08 Apr 2020 12:12 IST

కొండగట్టు: జగిత్యాల జిల్లాలో ప్రసిద్ద పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయంలో భక్తులు లేకుండానే హనుమాన్‌ జయంతి వేడుకలను ఆలయ సిబ్బంది నిరాడంబరంగా నిర్వహించారు. ఏటా నిర్వహించే హనుమాన్‌ జయంతికి లక్షలాది మంది భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకునేవారు. పలువురు భక్తులు దీక్ష విరమణ చేసేవారు. 

అయితే, ఈ ఏడాది కరోనా మహమ్మారి కారణంగా ఆలయం వెలవెలబోతోంది. భక్తులతో కిటకిటలాడే క్యూలైన్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఆలయ అర్చకులు, అధికారుల సమక్షంలోనే వేడుకలు నిర్వహిస్తున్నారు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి, ప్రత్యేక పూజలు, అభిషేకం నిర్వహించారు. హనుమాన్‌ జయంతిని పురష్కరించుకొని భక్తులు ఎవరూ ఆలయానికి రాకుండా కొండపైకి చేరుకునే ప్రధాన రహదారిని భద్రతా సిబ్బంది మూసివేశారు. గత 25 ఏళ్లుగా ఆలయంలో హనుమాన్‌ జయంతి వేడుకలను ఘనంగా జరుపుతుండగా.. ప్రస్తుతం లాక్‌డౌన్‌ కారణంగా తొలిసారి భక్తులు లేకుండానే ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ సిబ్బంది తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని