జగిత్యాల క్వారంటైన్‌ నుంచి 85 మంది ఇంటికి

జగిత్యాల జిల్లాలో ప్రభుత్వ క్వారంటైన్‌లోని 85 మందిని అధికారులు ఇళ్లకు పంపించారు. వీరిలో దిల్లీలోని నిజాముద్దీన్‌లో తబ్లీగీ జమాత్‌కు వెళ్లొచ్చినవారు 70 మంది ఉన్నట్లు జిల్లా కలెక్టర్‌ తెలిపారు. అయితే వీరంతా ఈ నెల 21 వరకు హోం క్వారంటైన్‌లో.. 

Published : 08 Apr 2020 22:17 IST

జగిత్యాల: జగిత్యాల జిల్లాలో ప్రభుత్వ క్వారంటైన్‌లోని 85 మందిని అధికారులు ఇళ్లకు పంపించారు. వీరిలో దిల్లీలోని నిజాముద్దీన్‌లో తబ్లీగీ జమాత్‌కు వెళ్లొచ్చినవారు 70 మంది ఉన్నట్లు జిల్లా కలెక్టర్‌ తెలిపారు. అయితే వీరంతా ఈ నెల 21 వరకు హోం క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా కలెక్టర్‌ ఆదేశించారు. జిల్లాలోని కోరుట్లలో పాజిటివ్‌ వచ్చిన ఇద్దరు వ్యక్తులకు చెందిన 15 మంది కుటుంబసభ్యులు ఈ నెల 28 వరకు హోం క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా కలెక్టర్‌ సూచించారు. హోం క్వారంటైన్‌లో ఉన్నవారిపై నిరంతరం నిఘా ఉంటుందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని