మంచినీళ్లు అనుకుని శానిటైజర్‌ తాగిన డీఎంహెచ్‌వో

అనంతపురం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్‌వో) అనిల్‌ కుమార్‌ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం ఉదయం ఇంట్లో ఉన్న సమయంలో మంచినీళ్లు అనుకుని పొరపాటున పక్కనే ఉన్న శానిటైజర్‌ను రెండు గుటకలు వేశారు.

Published : 10 Apr 2020 09:45 IST

అనంతపురం: అనంతపురం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్‌వో) అనిల్‌ కుమార్‌ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం ఉదయం ఇంట్లో ఉన్న సమయంలో మంచినీళ్లు అనుకుని పొరపాటున పక్కనే ఉన్న శానిటైజర్‌ను రెండు గుటకలు వేశారు.

 వెంటనే అప్రమత్తమైన ఆయన కుటుంబ సభ్యులు సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. ప్రాణాపాయం లేదని, చికిత్స అనంతరం  2..3గంటల్లో డిశ్చార్జి చేస్తామని తెలిపారు. పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు ఆసుపత్రికి చేరుకుని అనిల్‌కుమార్‌ను పరామర్శించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని