లాక్డౌన్ వేళ .. పాప మందుల కోసం..
కరోనా వైరస్ నేపథ్యంలో ప్రస్తుతం లాక్డౌన్ కొనసాగుతున్న వేళ మానవత్వం చాటుకునే ఘటన కేరళలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అలెప్పిలో నివసిస్తున్న నాలుగేళ్ల బాలిక క్యాన్సర్తో...
సమయం మించిపోతుండగా.. 150 కిమీ బైక్రైడ్
తిరువనంతపురం: కరోనా వైరస్ నేపథ్యంలో ప్రస్తుతం లాక్డౌన్ కొనసాగుతున్న వేళ మానవత్వం చాటుకునే ఘటన కేరళలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అలెప్పీలో నివసిస్తున్న నాలుగేళ్ల బాలిక క్యాన్సర్తో పోరాటం చేస్తోంది. కీమో థెరపీలో భాగంగా ప్రతినెల ఆ బాలికను కుటుంబసభ్యులు అలెప్పీ నుంచి తిరువనంతపురం ప్రాంతీయ క్యాన్సర్ ఆస్పత్రికి తీసుకొచ్చేవారు. లాక్డౌన్ నేపథ్యంలో తిరువనంతపురానికి వచ్చి వెళ్లడం ఇబ్బందని, వైద్యులు ఆ బాలికకు తాత్కాలికంగా మందులు వాడమని సూచించారు. ఈ నేపథ్యంలో ఆ పాపకు మార్చి 29న సాయంత్రం 6 గంటలకల్లా మందులు వేయాల్సి ఉంది. అలెప్పీలో ఆ మందులు దొరకకపోవడంతో కుటుంబ సభ్యులు అక్కడి సివిల్ పోలీస్ రతీశ్ను సంప్రదించారు.
రతీశ్ తిరువనంతపురం మెడికల్ కాలేజ్లో పనిచేస్తున్న తన స్నేహితుడు, మాజీ పోలీస్ అధికారి విష్ణుకు పాప పరిస్థితిని వివరించాడు. విష్ణు పాపకు కావాల్సిన మందులు తిరువనంతపురం నుంచి పంపించడానికి సహకరిస్తానని చెప్పి ఆ మందుల చీటీని(ప్రిస్కిప్షన్)ను తీసుకెళ్లాడు. తీరా అక్కడికెళ్లాక ఆ చీటీ పాతదని తెలిసి, ఆ పాపకు అవసరమైన మందులు ఇచ్చారు తిరువనంతపురం వైద్యులు. అయితే, అప్పటికే పాపకు మందులు వాడాల్సిన సమయం మించిపోతుండడంతో విష్ణు వెంటనే బైక్పై 150 కిమీలకు పైగా ప్రయాణించి సాయంత్రం 5:10 కల్లా వాటిని అందజేశాడు. ఆపద సమయంలో తన మిత్రుడు చాలా రిస్క్ తీసుకొని మోటార్బైక్పై అంతదూరం ప్రయాణించాడని రతీశ్ మీడియాకు తెలిపాడు. ఆ మందులు ఇచ్చాక వారి నుంచి విష్ణు ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని రతీశ్ తెలిపాడు. పాపది నిరుపేద కుటుంబమని, ఆమెకు వైద్యం చేయించే స్థామత కూడా వారికి లేదని చెప్పాడు. దాతలెవరైనా సాయమందించాలని ఆయన కోరాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వినాసికారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
20 నుంచి పవన్ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం
-
మహిళకు శస్త్రచికిత్స చేసి.. తల్లీ బిడ్డను కాపాడిన దర్శి అభ్యర్థి
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
-
నడుం నొప్పి, కుంగుబాటు, తలనొప్పి.. అనారోగ్యానికి ప్రధాన కారణాలివే