పశ్చిమ్ బంగా: మత సభలకు పోలీసుల అనుమతి!
పశ్చిమ్ బంగాలో లాక్డౌన్ మెల్లమెల్లగా నీరుగారుతోందని కేంద్ర హోమంత్రిత్వ శాఖ అభ్యంతరం తెలిపింది. రాష్ట్రంలో నిత్యావసరం కాని దుకాణాలు సైతం తెరుస్తున్నారని పేర్కొంది. పోలీసులే స్వయంగా మత సమ్మేళనాలకు అనుమతి ఇస్తున్నారని
చాలారకాలుగా లాక్డౌన్ నీరుగారుతోందని కేంద్రం హెచ్చరిక
దిల్లీ: పశ్చిమ్ బంగాలో లాక్డౌన్ మెల్లమెల్లగా నీరుగారుతోందని కేంద్ర హోమంత్రిత్వ శాఖ అభ్యంతరం తెలిపింది. రాష్ట్రంలో నిత్యావసరం కాని దుకాణాలు సైతం తెరుస్తున్నారని పేర్కొంది. పోలీసులే స్వయంగా మత సమ్మేళనాలకు అనుమతి ఇస్తున్నారని వెల్లడించింది. లాక్డౌన్ అమలుకు కఠిన చర్యలు తీసుకోవాలని పశ్చిమ్బంగా డీజీపీ, ప్రధాన కార్యదర్శికి కేంద్రం లేఖలు రాసింది. రాష్ట్రంలో కూరగాయలు, చేపలు, మాంసాహార మార్కెట్లలో నియంత్రణ లేదని, వ్యక్తిగత దూరం పాటించడం లేదని వెల్లడించింది. ‘పశ్చిమ్బంగాలో లాక్డౌన్ క్రమంగా నీరుగారుతోందని భద్రతా సంస్థల నుంచి నివేదికలు అందాయి. రాష్ట్ర ప్రభుత్వమే చాలా మినహాయింపులు ఇస్తోంది. ఉదాహరణకు నిత్యావసరం కాని దుకాణాలు తెరుస్తున్నారు’ అని లేఖలో పేర్కొంది.
కోల్కతాలోని రజాబజార్, నార్కెల్ దంగా, తోప్సియా, మెటియాబర్జ్, గార్డెన్రీచ్, ఇక్బాల్పుర్, మనిక్టాలలో అసలు సామాజిక దూరం పాటించడం లేదని, నియంత్రణ కొరవడిందని కేంద్రం తెలిపింది. నార్కెల్ దంగా వంటి ప్రాంతాల్లో కొవిడ్-19 కేసులు పెరుగుతున్నాయని వివరించింది. ‘మత సమ్మేళనాలకు పోలీసులే అనుమతినిస్తున్నట్టు నివేదికలు అందాయి. ఉచిత రేషన్ సరుకులను ప్రభుత్వ వ్యవస్థీకృత పద్దతుల్లో కాకుండా రాజకీయ నాయకులు అందజేస్తున్నారు. ఇది కొవిడ్-19 వ్యాప్తికి కారకం అవుతుంది’ అని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇలాంటి ఉల్లంఘనలకు అంటువ్యాధుల నియంత్రణ చట్టం, ఐపీసీ ప్రకారం శిక్షలు ఉంటాయని గుర్తుచేసింది. ‘కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. వెంటనే కేంద్ర హోమంత్రిత్వ శాఖకు తెలియజేయాలి. భవిష్యత్తులో ఇలాంటి ఉల్లంఘనలు జరగకుండా చూడాలి’ అని కేంద్రం తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెలంగాణలో పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు.. ఏప్రిల్ ఒకటి నుంచి వడగాల్పులు
తెలంగాణ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. సాధారణం కన్నా రెండు నుంచి మూడు డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
అనన్య-ఆదిత్య ఫొటోషూట్.. అల్లు అర్జున్-స్నేహారెడ్డి స్పెషల్ మూమెంట్
-
తెలంగాణలో పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు.. ఏప్రిల్ ఒకటి నుంచి వడగాల్పులు
-
కొరియాపై ఐరాస ఆంక్షల వల్ల ప్రయోజనం లేదు: రష్యా
-
టిల్లు స్క్వేర్.. రూ.100 కోట్ల గ్రాస్ వస్తుందనుకుంటున్నా: నాగవంశీ
-
‘వారిపై సినిమాలు రావాలి’.. మస్క్ ఆలోచనకు మహీంద్రా సపోర్ట్
-
ఐటీ నోటీసులపై దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పిలుపు