కరోనా నిర్ధరణ పరీక్షలకు ‘ట్రూనాట్‌ పరికరాలు’

కరోనా పరీక్షలను వేగవంతం చేయడానికి క్షయ వ్యాధి నిర్ధరణకు ఉపయోగించే ట్రూనాట్‌ పరికరాలను ప్రభత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. ..

Published : 11 Apr 2020 19:55 IST

అమరావతి: కరోనా పరీక్షలను వేగవంతం చేయడానికి క్షయ వ్యాధి నిర్ధరణకు ఉపయోగించే ట్రూనాట్‌ పరికరాలను ప్రభత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన కొన్ని ప్రాంతాల్లో వీటితో వైరస్‌ నిర్ధరణ పరీక్షలు చేపట్టారు. సాధారణంగా బీఎస్‌ఎల్‌(బయో సేఫ్టీ క్యాబినెట్‌ లెవల్‌)-2లో పాజిటీవ్‌, బీఎస్‌ఎల్‌-3లో నెగిటీవ్‌ ప్రెజర్‌ ఉంటుంది. నెగిటీవ్‌ ప్రెజర్‌ ఉన్నగదుల్లో ఈ పరీక్షలు చేయాల్సి ఉంటుంది. కానీ ఎక్కువ మొత్తంలో అవి అందుబాటులో లేకపోవడంతో బీఎస్‌ఎల్‌-2లోనూ పరీక్షలు చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తిరుపతిలోని వేంకటేశ్వర పశువైద్య కళాశాలలో బీఎస్‌ఎల్‌-3 సౌకర్యం అందుబాటులో ఉన్నందున వాటిలోనే పరీక్షలు చేస్తున్నట్లు అక్కడి లాబరేటరీ ఇన్‌ఛార్జి తెలిపారు. 

 

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని