సైకిల్పై ఏడు రోజులు.. 1,700 కి.మీ..
సైకిల్పై ఏడు రోజులు 1,700 కి.మీ ప్రయాణం
స్వస్థలానికి చేరుకున్న ఒడిశా యువ కార్మికుడు
ఇంటర్నెట్ డెస్క్: లాక్డౌన్ కారణంగా పనిచేసే పరిశ్రమ మూతబడింది. మూడు నెలల వరకు ఇదే పరిస్థితి ఉంటుందని విన్నాడు. ఇంటికి వెళ్దామంటే.. ప్రజారవాణా స్తంభించింది. అయినా ఎలాగైనా సొంత ఊరికి చేరుకోవాలన్న మొండి పట్టుదలతో ఓ యువ కార్మికుడు.. వంద కాదు.. రెండొందలు కాదు.. ఏకంగా 1,700 కిలోమీటర్లు ప్రయాణించాడు. అదీ సైకిల్ తొక్కుకుంటూ. చేతిలో మ్యాప్ లేకున్నా.. గుర్తున్న ప్రధాన రైల్వేస్టేషన్ల ఆధారంగా స్వస్థలానికి చేరుకున్నాడు. అతనే ఒడిశాలోని జాజ్పూర్ జిల్లాకు చెందిన మహేశ్ జినా.
రోజుకు 16 గంటల ప్రయాణం..
మహారాష్ట్ర సాంగ్లీ మిరాజ్లోని ఓ పరిశ్రమలో కార్మికుడిగా పనిచేస్తున్న మహేశ్.. లాక్డౌన్ సమయంలో అక్కడే ఖాళీగా ఉంటే ఖర్చవుతుందని భావించాడు. రూ.3 వేలు, ఒక సైకిల్తో ఇంటి బాట పట్టాడు. సైకిల్పై అంతదూరం ప్రయాణం సాధ్యం కాదని తోటివారు చెప్పినా.. పట్టువిడవకుండా ఏప్రిల్ 1న అక్కడినుంచి బయల్దేరాడు. రోజుకు 16 గంటలు.. దాదాపు 200 కి.మీ సైకిల్ తొక్కుతూ.. శోలాపూర్, హైదరాబాద్, విజయవాడ, శ్రీకాకుళం మీదుగా ఒడిశాకు చేరుకున్నట్లు మహేశ్ తెలిపాడు. ‘తెల్లవారుజామునే ప్రయాణం మొదలుపెట్టేవాడిని. వేడి వాతావరణం ఇబ్బంది పెట్టినా.. వెనుకాడలేదు. రాత్రుళ్లు గుళ్లు, పాఠశాలల్లో నిద్రపోయేవాడిని. రోడ్ల పక్కన దాబాల్లో పొట్ట నింపుకొనేవాడిని. మధ్యలో కొందరు లారీ డ్రైవర్లు నాకు అండగా నిలిచారు’ అని వివరించాడు. మహారాష్ట్ర సరిహద్దులో పోలీసులు ఆపినప్పడు నా సైకిల్ ప్రయాణం గురించి ఆసక్తికర అంశాలను వారికి వివరించి బయటపడ్డానని చెప్పుకొచ్చాడు. ఏప్రిల్ 7వ తేదీన సాయంత్రం ఇంటికి చేరుకున్న అతన్ని అధికారులు స్థానికంగా ఓ పాఠశాలలో క్వారంటైన్ చేశారు. ఈ కేంద్రంలో ఒంటరిగా ఉండటం కన్నా సైకిల్ ప్రయాణమే బాగుందని మహేశ్ పేర్కొనడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
విశాఖ ఉక్కు కర్మాగారానికి చెందిన భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఏపీ హైకోర్టు ఆదేశించింది. -
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై ప్రజల నుంచి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఫిర్యాదులు, నివేదనలు కోరింది. -
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
సీఎం జగన్కు బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుందని వైఎస్ సునీత అన్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్ - బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా గురువారం రాత్రి 7.30 గంటలకు సన్రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. -
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
సీఎం జగన్ (YS Jagan)కు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్య (Viveka Murder Case)కు కారకులైన వారికి మళ్లీ ఎంపీగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారంటూ ఆమె నిలదీశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం