లాక్‌డౌన్‌కు సిద్ధం కావాలి: సంజయ్‌

లాక్‌డౌన్‌‌ పొడిగింపుపై భాజపా కార్యకర్తలు సంసిద్ధం కావాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పిలుపునిచ్చారు. దేశహితం కోసం ప్రధాని నరేంద్రమోదీ తీసుకునే ఏ నిర్ణయానికైనా పార్టీ కార్యకర్తలు

Published : 11 Apr 2020 20:34 IST

హైదరాబాద్‌: లాక్‌డౌన్‌‌ పొడిగింపుపై భాజపా కార్యకర్తలు సంసిద్ధం కావాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పిలుపునిచ్చారు. దేశహితం కోసం ప్రధాని నరేంద్రమోదీ తీసుకునే ఏ నిర్ణయానికైనా పార్టీ కార్యకర్తలు కార్యోన్ముఖులు కావాలన్నారు. లాక్‌డౌన్ కాలంలో ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకుండా భాజపా శ్రేణులు సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆయన ఓ ప్రకటనలో పిలుపునిచ్చారు. తెలంగాణలో రోజు రోజుకూ పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసుల దృష్ట్యా లాక్‌డౌన్ పొడిగించే అవకాశం ఉందన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో రాజకీయాలు తగవన్నారు. మర్కజ్ వెళ్లిన వారికి పాజిటివ్‌లు పెరుగుతున్న తరుణంలో కట్టడికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్న పార్టీ కార్యకర్తలను వేధింపులకు గురిచేయడం పోలీసులకు తగదన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని