కేటీఆర్‌ ఎంతో మెచ్చిన ఫొటో ఇది!

కరోనా మహమ్మారి కట్టడికి దేశమంతా ఒకేతాటిపై నడుస్తోంది. సామాజిక దూరం పాటిస్తూ ప్రజలంతా ఇళ్లలోనే ఉంటున్నారు. అత్యవసరాల కోసం బయటికి వచ్చినప్పటికీ.. జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దుకాణాల వద్ద కూడా కొన్ని మీటర్ల దూరం పాటిస్తున్నారు. ప్రభుత్వం, అధికారులు.....

Published : 12 Apr 2020 15:30 IST

హైదరాబాద్‌: కరోనా మహమ్మారి కట్టడికి దేశమంతా ఒకేతాటిపై నడుస్తోంది. సామాజిక దూరం పాటిస్తూ ప్రజలంతా ఇళ్లలోనే ఉంటున్నారు. అత్యవసరాల కోసం బయటికి వచ్చినప్పటికీ.. జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దుకాణాల వద్ద కూడా కొన్ని మీటర్ల దూరం పాటిస్తున్నారు. ప్రభుత్వం, అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ కొందరు నిబంధనలను ఉల్లంఘిస్తూనే ఉన్నారు. ఈ తరుణంలో ఓ ఫొటో మంత్రి కేటీఆర్‌ మనసును ఆకట్టుకుంది. ఓ దుకాణానికి వెళ్లిన ఐదుగురు చిన్నారులు అక్కడ గీసిన బాక్సుల్లో నిల్చున్నారు. లోకం తెలియని వీరు కూడా సామాజిక దూరం పాటించడంతో ఈ ఫొటో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

దీన్ని కేటీఆర్‌ ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ‘ఈ వారంలో నాకు ఎంతో నచ్చిన ఫొటో ఇది. ఈ ముద్దులొలికే చిన్నారులు పెద్దలకు సామాజిక దూరం గురించి నేర్పిస్తున్నారు’ అంటూ ఇంట్లో జాగ్రత్తగా ఉండండి అని పేర్కొన్నారు. ఈ ఫొటోను చాలా మంది లైక్‌ చేశారు. తమకు ఎదురైన అనుభవాలను షేర్‌ చేశారు. ‘మార్కెట్‌ దగ్గర పెద్దలే దూరం పాటించడం లేదు, పెద్దలకంటే పిల్లలే మేలు, స్వీట్‌, సూపర్‌, తర్వాతి జనరేషన్‌ స్ఫూర్తినిస్తోంది..’ అంటూ కామెంట్లు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని